Asianet News TeluguAsianet News Telugu

ఎన్ని పరువు హత్యలు జరిగాయి.. మీరేం చేశారు: తెలంగాణ డీజీపీని ప్రశ్నించిన హైకోర్టు

పరువు హత్యలపై గురువారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ మేరకు పరువు హత్యలపై న్యాయస్థానానికి డీజీపీ మహేందర్‌రెడ్డి నివేదిక సమర్పించారు. పరువు హత్యలను అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కోర్టుకు డీజీపీ తెలిపారు. 

telangana high court hearing on honor killing ksp
Author
Hyderabad, First Published Apr 1, 2021, 4:48 PM IST

పరువు హత్యలపై గురువారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ మేరకు పరువు హత్యలపై న్యాయస్థానానికి డీజీపీ మహేందర్‌రెడ్డి నివేదిక సమర్పించారు. పరువు హత్యలను అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కోర్టుకు డీజీపీ తెలిపారు.

పరువు హత్యలను తీవ్రంగా పరిగణించి దర్యాప్తు చేస్తున్నామని నివేదికలో వెల్లడించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటిస్తున్నామని ఆయన హైకోర్టుకు నివేదించారు.

దీనిపై స్పందించిన ధర్మాసనం సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఎలా అమలు చేశారో తెలపాలని డీజీపీని ఆదేశించింది. ఇప్పటి వరకు పరువు హత్యలు ఎన్ని జరిగాయని న్యాయస్థానం ప్రశ్నించింది.

దర్యాప్తు ఏ స్థాయిలో ఉందో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు సామాజిక కార్యకర్త సాంబశివరావు దాఖలు చేసిన పిల్‌పై విచారణను ఆగస్టు 5కి హైకోర్టు వాయిదా వేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios