రేవంత్ రెడ్డికి ఊరట: షరతులతో కూడిన బెయిల్ మంజూరు
కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి హైకోర్టు బుధవారం నాడు బెయిల్ మంజూరు చేసింది.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి హైకోర్టు బుధవారం నాడు బెయిల్ మంజూరు చేసింది.
గతంలో కూకట్పల్లి కోర్టు రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. దీంతో రేవంత్ రెడ్డి హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. షరతులతో కూడిన బెయిల్ను రేవంత్ రెడ్డికి ఇచ్చింది తెలంగాణ హైకోర్టు.
Also read:రేవంత్ కు అధిష్టానం మద్దతు... హైదరాబాద్ కు సుప్రీంకోర్ట్ సీనియర్ లాయర్
మంత్రి కేటీఆర్ లీజుకు తీసుకొన్న ఫామ్హౌస్పై డ్రోన్ కెమెరాను ఉపయోగించి ఫోటోలు తీశారనే విషయమై నార్సింగ్ పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ఈ కేసులో 14 రోజుల పాటు రేవంత్ రెడ్డి చర్లపల్లి జైలులో ఉన్నాడు.
మార్చి 11వ తేదీన కూకట్పల్లి కోర్టు రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాను ఉపయోగించిన కేసులో ఏ-1 నిందితుడుగా ఉన్నాడు. రేవంత్ రెడ్డి అనుచరులకు ఇప్పటికే బెయిల్ మంజూరైంది. కానీ,రేవంత్ రెడ్డికి మాత్రం కోర్టు బెయిల్ ఇవ్వలేదు.
రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను ఈ నె 11వ తేదీన హైకోర్టు కొట్టివేసింది. . కేటీఆర్ లీజుకు తీసుకొన్న ఫామ్హౌస్పై అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాను ఉపయోగించారని నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో రేవంత్ రెడ్డిని ఈ నెల 5వ తేదీన నార్సింగ్ పోలీసులు అరెస్టు చేశారు.
రేవంత్ రెడ్డితో పాటు ప్రవీణ్, విజయసింహ, జైపాల్ రెడ్డి, శివ, ఓంప్రకాశ్ లను కూడా పోలీసులు అరెస్టు చేశారు. వీరికి రాజేంద్రనగర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎట్టకేలకు బుధవారం నాడు రేవంత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.