తెలంగాణ వ్యాప్తంగా ఓటర్లకు చేరువయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వ్యూహంలో భాగంగా కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది.ఈ మేరకు ప్రభుత్వం ప్రైమరీ నోటిఫికేషన్ జారీ చేసింది. పదిహేను రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించి.. ఆ తర్వాత తుది నోటిఫికేషన్ జారీ చేయనున్నది.
తెలంగాణలో మరో కొత్త మూడు మండలాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ప్రైమరీ నోటిఫికేషన్ జారీ చేసింది. పదిహేను రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించి.. ఆ తర్వాత తుది నోటిఫికేషన్ జారీ చేయనున్నది. ఈ క్రమంలో మంగళవారం రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ మండలాల ఏర్పా టు ఉత్తర్వులు ఇచ్చారు.
నిర్మల్ జిల్లాలో రెండు కొత్త మండలాలు ఏర్పాటు చేయబోతుండగా.. వనపర్తి జిల్లాలో ఒక కొత్త మండలం ఏర్పాటు చేయబోతున్నారు. నిర్మల్ జిల్లాలో 15 గ్రామాలతో మాలేగావ్ ను మండలంగా.. 12 గ్రామాలతో బెల్తారోడా మండలంగా, అలాగే వనపర్తి జిల్లాలో 8 గ్రామాలతో ఏదుల మండలాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
వనపర్తి జిల్లాలోని చిన్నారం, చీరకపల్లి, ఏదుల, సింగాయిపల్లి, తుర్కదిన్నె, మాచుపల్లి, ముత్తిరెడ్డిపల్లి, రేకుపల్లి గ్రామాలతో ఏదుల మండలంగా..
నిర్మల్ జిల్లాలో సన్వాలి, వాయి, లింగి, సౌనా, హంపోలి (బి), మోలా, అంతర్ని, పంగ్రా, గొడ్సెర, సొనారి, నిగ్వా, మాలేగావ్, గోదాపూర్, కుప్టి, వర్ని గ్రామాలను కలుపుతూ మాలేగావ్ మండలంగా..
ఇదే జిల్లాలోని ఝరి (కే), వాజ్హరి, బెల్తారోడా, భోసి, మహాలింగి, బమిని, బండోరత్, బోస్లా, ఝరి (బుజుర్గ్), ఉమ్రీ (ఖుర్ద్), బోరేగావ్ (ఖుర్ద్), బెంబెర్ గ్రామాలను కలుపుతూ బెల్తారోడా మండలంగా ప్రతిపాదించింది.
ఈ మేరకు ప్రభుత్వం ప్రైమరీ నోటిఫికేషన్ జారీ చేసింది. 15 రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించి.. ఆ తర్వాత తుది నోటిఫికేషన్ జారీ చేయనున్నది.
