రాష్ట్రంలోని గురుకులాలు , అనుబంధ హాస్టళ్ల డైట్ ఛార్జీలను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పెరిగిన డైట్ చార్జీలు జూలై నుంచి అమలు చేయాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో తెలిపింది.

రాష్ట్రంలోని గురుకులాలు , అనుబంధ హాస్టళ్ల డైట్ ఛార్జీలను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డైట్ ఛార్జీల పెంపు ప్రతిపాదనకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదముద్ర వేశారు. దీని ప్రకారం 3 నుంచి 7వ తరగతి వరకు డైట్ ఛార్జ్‌‌లను రూ.1200కు.. 8 నుంచి 10 తరగతుల విద్యార్ధులకు రూ.1400.. ఇంటర్ పీజీ విద్యార్ధులకు రూ.1875గా పెంచారు. పెరిగిన డైట్ చార్జీలు జూలై నుంచి అమలు చేయాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో తెలిపింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred