Plastic-free forests: అడవులను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆయా ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించేందుకు తెలంగాణ అటవీ శాఖ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కులను ప్లాస్టిక్ రహిత మండలాలుగా తీర్చిదిద్దే దిశగా ప్రయత్నాలు చేస్తోంది.
Telangana forests: మానవ చర్యల కారణంగా భూ వాతావరణం తీవ్రమైన మార్పులకు లోనవుతున్నదని పరిశోధకులు ఆందోళన వ్యక్త చేస్తున్నారు. ముఖ్యంగా అడవుల నరికివేత.. ఉన్న అడవులు కాలుష్యం కారణంగా జీవజాతులపై ప్రభావం పడుతోంది. ప్లాస్టిక్ వినియోగం గణనీయంగా పెరగడంతో వాతవారణ కాలుష్యం కూడా పెరుగుతోంది. అడవుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పెరుకుపోతుండటం పర్యావరణ కాలుష్యానికి కారణం కావడంతో పాటు అక్కడ నివసిస్తున్న వన్యప్రాణుల మనుగడ కూడా ప్రమాదంలో పడుతోంది. ఈ నేపథ్యంలోనే అడవులను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆయా ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించేందుకు తెలంగాణ అటవీ శాఖ ప్రత్యేక బృందాలను ఏర్పాటు ఏర్పాటు చేసింది. వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కులను ప్లాస్టిక్ రహిత మండలాలుగా తీర్చిదిద్దే దిశగా ప్రయత్నాలు చేస్తోంది.
ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించేందుకు తెలంగాణ అటవీ శాఖ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అడవులు, పులుల సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కులను ప్లాస్టిక్ రహిత మండలాలుగా తీర్చిదిద్దే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న వివరాల గురించి అటవీ అధికారుల వెల్లడించిన వివరాల ప్రకారం.. అటవీ ప్రాంతాలలో మానవ కార్యకలాపాలు నేరుగా ప్లాస్టిక్ చెత్త పేరుకుపోవడానికి దారితీశాయి. ఇది వన్యప్రాణులకే కాకుండా పర్యావరణ వ్యవస్థకు కూడా హాని కలిగిస్తుందని నిరూపించబడింది. అడవుల్లో మంటలు చెలరేగడానికి కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు దోహదం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయా ప్రాంతాల్లోని ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు చర్యలు చేపట్టామని తెలిపారు. శ్రీశైలం హైవేపై ఉన్న అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో అటవీ శాఖ ఇప్పటికే ఈ దిశలో సానుకూల విజయాలు సాధించింది. ఇటీవలే ఏర్పాటైన ప్రత్యేక స్క్వాడ్లను డిపార్ట్మెంట్ ఈ ప్రయత్నంలో ఉపయోగించుకుంటుంది. కన్వాల్ టైగర్ రిజర్వ్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి.. ఆ అడవి నుండి 1,000 కిలోల ప్లాస్టిక్ను క్లియర్ చేసింది.
రెండు టైగర్ రిజర్వ్లతో పాటు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మరియు హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ (HoFF), RM డోబ్రియాల్ ప్లాస్టిక్ రీసైక్లింగ్ ప్రక్రియను KBR, మృగవాణి మరియు మహావీర్ హరినా వనస్థలి అనే మూడు జాతీయ పార్కులకు విస్తరించాలని అధికారులను ఆదేశించారు. 'ప్లాస్టిక్ ఫ్రీ జోన్స్' కార్యక్రమం పాఖాల్, కిన్నెరసాని, పోచారం మరియు ఏటూరునాగారంలోని సహజ అభయారణ్యాలతో పాటు 109 అర్బన్ పార్కులను విస్తరించిందని సంబంధిత అధికారులు తెలిపారు. అటవీ శాఖ తడి, పొడి చెత్తను వేరు చేయడానికి రీసైక్లింగ్ స్టేషన్లను అభివృద్ధి చేసింది. అలాగే ప్రాసెసింగ్ సౌకర్యాలకు రవాణా లాజిస్టిక్లను క్రమబద్ధీకరించింది. ఈ ప్రయత్నం చెట్లపై ఆధారపడి జీవించే వారికి ఉద్యోగాలను కూడా సృష్టిస్తుందని అటవీ శాఖ తెలిపింది. బాధ్యతాయుతమైన పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో భాగంగా, అడవుల గుండా వెళ్లే వారు ప్లాస్టిక్ వ్యర్థాలు మరియు సిగరెట్ పీకలు వేయకుండా ఉండాలని అటవీ శాఖ సూచించింది.
