Asianet News TeluguAsianet News Telugu

టీ. కాంగ్రెస్‌లో ముసలం .. రేవంత్‌పై సీనియర్ల తిరుగుబాటు, ఏ సమావేశం పెట్టినా బహిష్కరణే

తెలంగాణ కాంగ్రెస్‌లో ముసలం పుట్టింది. ఇటీవలి టీపీసీసీ కమిటీల నియామకంపై గుర్రుగా వున్న సీనియర్లు రేవంత్‌ రెడ్డిని టార్గెట్ చేశారు. ఆయన పెట్టే ఏ సమావేశానికైనా పెట్టే ఏ సమావేశానికీ హాజరు కాకూడదని సీనియర్లు నిర్ణయం తీసుకున్నారు.

telangana congress seniors shock to tpcc chief revanth reddy
Author
First Published Dec 17, 2022, 4:49 PM IST

ఇటీవల ప్రకటించిన టీపీసీసీ ఎగ్జిక్యూటివ్, జిల్లా కమిటీల నియామకానికి సంబంధించి సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు నేతలు బాహాటంగానే తమ నిరసనను తెలియజేశారు. ఈ క్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసంలో శనివారం సీనియర్లు భేటీ అయి భవిష్యత్తు కార్యాచరణపై ప్రకటించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిర్ణయాలను వీరంతా మూకుమ్మడిగా వ్యతిరేకించారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి పెట్టే ఏ సమావేశానికీ డసీనియర్లు నిర్ణయం తీసుకున్నారు. 

రేపు పీసీసీ సమావేశం పెట్టినా బహిష్కరించాలని సీనియర్లు నిర్ణయించారు. రేపటి పీసీసీ సమావేశంలో ఏఐసీసీ కార్యక్రమాలపై చర్చించాలని పీసీసీ కార్యవర్గం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు.. వచ్చే మంగళవారం మరోసారి కాంగ్రెస్ సీనియర్ నేతలు భేటీ కావాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి మరికొందరినీ పిలవాలని నేతలు నిర్ణయించారు. మరోవైపు టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్‌ మాణిక్కం ఠాగూర్ వైఖరిపై కూడా ఈ సమావేశంలో చర్చించాలని భావిస్తున్నట్టుగా సమాచారం. మంగళవారం జరిగే సమావేశంలో టీ కాంగ్రెస్ సీనియర్ నేతలు వారి అజెండాను ఖరారు చేసే అవకాశం ఉంది. 

ALso REad:టీ కాంగ్రెస్‌లో తుఫాన్.. మంగళవారం మరోసారి సీనియర్ నేతల భేటీ.. అదే రోజు అజెండా ఖరారు..!

కాగా... సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నివాసంలో జరిగిన సీనియర్ నేతల సమావేశంలో ఉత్తమ్ కుమార్, దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, మధుయాష్కి‌లతో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం నాయకులు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి పేరు ఎత్తకుండా ఆయనపై కామెంట్స్ చేశారు. ఒర్జినల్‌ కాంగ్రెస్‌ నినాదంతో.. వలస వచ్చిన నేతల వల్ల పార్టీ నమ్ముకున్న వాళ్లకు తీవ్ర నష్టం జరుగుతుందని ఉమ్మడి గళం వినిపించారు. టీపీసీసీ కమిటీల్లో బయటి నుంచి వచ్చినవారికే.. ముఖ్యంగా టీడీపీ నుంచి వచ్చిన వాళ్లకే ఎక్కువ పదవులు దక్కాయని చెప్పారు. రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించనప్పటికీ.. వలస నాయకుడు, నాలుగు పార్టీలు మారిన వ్యక్తి  తెలంగాణలో కాంగ్రెస్‌ను ఉద్దరిస్తారా? అంటూ తీవ్ర విమర్శలు చేశారు. పార్టీని హస్తగతం చేసుకోవడానికో, ఇంకొకరికి అప్పజెప్పాలనో కుట్ర జరుగుతుందని కూడా ఆరోపించారు. 

సోషల్ మీడియా పోస్టులతో కాంగ్రెస్‌లో మొదటి నుంచి ఉన్న నాయకులపై కోవర్టులుగా ముద్ర వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత అనుకూల మీడియా ద్వారా విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాము కాంగ్రెస్‌లోనే పుట్టామని, కాంగ్రెస్‌లోనే ఉన్నామని, కాంగ్రెస్‌లోనే చస్తామని నేతలు స్పష్టం చేశారు. అసలైన కాంగ్రెస్‌వాదులకు న్యాయం జరగాలన్నదే తమ లక్ష్యమని.. అందుకే సేవ్ కాంగ్రెస్ కార్యక్రమంతో ముందుకు వెళ్లనున్నట్టుగా ప్రకటించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios