మహబూబ్‌నగర్ లో టీఆర్ఎస్ కార్యాలయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్  ప్రారంభించారు.

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ లో టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారంనాడు ప్రారభించారు. ఇవాళ ఉదయం ప్రగతి భవన్ నుండి కేసీఆర్ భారీ కాన్వాయ్ తో తెలంగాణ సీఎం కేసీఆర్ మహబూబ్ నగర్ కు చేరకున్నారు. మహబూబ్ నగర్ కు చేరుకున్న కేసీఆర్ టీఆర్ఎస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. తొలుత పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తెలంగాాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని పలు జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ భవన నిర్మాణాలను ఆ పార్టీ చేపట్టింది. నూతన పార్టీ భవనాల నిర్మాణాలు పూర్తికావడంతో ఒక్కో జిల్లాలో పార్టీ భవనాలను కేసీఆర్ ప్రారంభిస్తున్నారు. అంతేకాదు కొత్త జిల్లాల్లో కొత్త కలెక్టరేట్ భవనాలను నిర్మించారు. కొత్త జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంతో పాటు కొత్త కలెక్టరేట్ ల నిర్మాణాలను కేసీఆర్ ఇటీవల కాలంలో వరుసగా ప్రారంభిస్తున్నారు.