సారాంశం

వ్యక్తిగత తప్పిదం వల్లనే మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్‌పై వేటు పడిందని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్ ప్రశాంతంగా ముగిసిందన్నారు. ఎన్నికల కోడ్ నవంబర్ 8 తర్వాత ఎత్తేస్తామని వికాస్ రాజ్ పేర్కొన్నారు. 

మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్ ప్రశాంతంగా ముగిసిందన్నారు తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వీవీప్యాట్లు లెక్కించాక అధికారికంగా ఫలితాలు ప్రకటిస్తామన్నారు. ప్రొసిజర్ ప్రకారమే ఆర్‌వో ఫలితాలు విడుదల చేశారని.. ఎక్కడా పక్షపాతం లేకుండా ఎన్నికలు ముగించామని వికాస్ రాజ్ తెలిపారు. ఎన్నికల కోడ్ నవంబర్ 8తో ముగుస్తుందని ఆయన వెల్లడించారు. వ్యక్తిగత తప్పిదం వల్లనే మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్‌పై వేటు పడిందని వికాస్ రాజ్ వివరణ ఇచ్చారు. ఎన్నికల సిబ్బందికి సహకరించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

అంతకుముందు ఉదయం వికాస్ రాజ్ మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల జాప్యం జరుగుతుందంటూ వస్తున్న వార్తలపై స్పందించారు. కౌంటింగ్‌లో ఎలాంటి అవకతవకలు జరగడం లేదని వెల్లడించారు. కౌంటిగ్ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు. ప్రతి టేబుల్ మీద ప్రతి అభ్యర్థికి చెందిన ప్రతినిధులు ఉన్నారని అన్నారు. ఎలాంటి అవకతవకలు జరగడానికి అవకాశం జరగడానికి అవకాశం లేదన్నారు. ఆర్వో సంతకం చేసిన తర్వాతే ఫలితాలు  వెల్లడిస్తున్నట్టుగా తెలిపారు. ప్రతి రౌండ్‌ కౌంటింగ్‌కు అరగంట కంటే ఎక్కువ సమయం పడుతుందని అన్నారు. ఎక్కువ మంది అభ్యర్థులు ఉండటం వల్లే ఆలస్యం అవుతుందని వికాస్ రాజ్ స్పష్టం చేశారు. 

ALso REad:మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు.. పోరాడి ఓడిన బీజేపీ, చేతులెత్తేసిన కాంగ్రెస్

ఇకపోతే.. తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో ఉత్కంఠ రేపిన మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి... తన సమీప ప్రత్యర్ధి, బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై 11,666 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. అటు కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడంతో పాటు తన కంచుకోటలో డిపాజిట్ కోల్పోయింది. రెండు  రౌండ్లలో  మినహా ఏ రౌండ్ లో కూడ బీజేపీ  మెజారిటీని దక్కించుకోలేకపోయింది. చౌటుప్పల్  పట్టణంలోని  బీజేపీ  ప్రభావిత  పోలింగ్ కేంద్రాల్లో  మినహా  మిగిలిన చోట్ల బీజేపీకి ఆధిక్యత  లభించింది.  మొదటి రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యతను  సాధించింది. రెండు, మూడు   రౌండ్లలో బీజేపీ  లీడ్ లో ఉంది., నాలుగో  రౌండ్  నుండి  15 వ  రౌండ్ వరకు  టీఆర్ఎస్  లీడ్ లో  కొనసాగింది.