Asianet News TeluguAsianet News Telugu

దేశంలో బీజేపీ రాక్షస పాలన చేస్తోంది : టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కా సుమ‌న్

Hyderabad: దేశంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) రాక్ష‌స పాల‌న సాగిస్తోంద‌ని తెలంగాణ రాష్ట్ర స‌మితి (టీఆర్ఎస్) ఎమ్మెల్యే బాల్కా సుమ‌న్ అన్నారు. ఇలాంటి స‌మ‌యంలో దేశాన్ని కాపాడుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తెలిపారు. 
 

Telangana : BJP is ruling the country with demonic rule: TRS MLA Balka Suman
Author
First Published Sep 9, 2022, 11:48 AM IST

TRS MLA Balka Suman: తెలంగాణ‌లో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. ఇరు పార్టీల నేత‌లు ఒక‌రిపై ఒక‌రు తీవ్ర విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లతో విరుచుకుప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే కేంద్రంలో అధికారంలో ఉన్న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) స‌ర్కారుపై తెలంగాణ రాష్ట్ర స‌మితి (టీఆర్ఎస్) ఎమ్మెల్యే బాల్కా సుమ‌న్ మ‌రోసారి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. దేశంలో బీజేపీ రాక్ష‌స పాల‌న సాగిస్తున్న‌ద‌ని ఆరోపించారు. ఇలాంటి సమయంలో దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. అన్ని రంగాల నిపుణులు దేశానికి ఓ కొత్త నాయకుడు కావాలని కోరుతున్నార‌ని పేర్కొన్నారు. అన్ని జిల్లా ల పార్టీ అధ్యక్షులుగా మేమంతా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను జాతీయ రాజకీయాల్లో కి రావాలని కోరుతున్నామ‌ని తెలిపారు. సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నామ‌ని అన్నారు. 

"దేశంలోని అన్ని రంగాల నిపుణులు, ప్ర‌జ‌లు దేశానికి కొత్త నాయ‌కుడు కావాల‌ని కోరుతున్నారు. అన్ని జిల్లా ల పార్టీ అధ్యక్షులుగా మేమంతా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను జాతీయ రాజకీయాల్లో కి రావాలని కోరుతున్నాం.. సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నం.. మ‌ళ్లీ ఉద్య‌మానికి న‌డుం క‌ట్టాల్సిందే.." న‌ని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కా సుమ‌న్ అన్నారు. తెలంగాణ ప్రజలు ,దేశ ప్రజలు కేసీఆర్ ను జాతీయ రాజకీయాల్లో చూడాలనుకుంటుంన్నార‌ని తెలిపారు. బీజేపీ ముక్త్ భారత్ దిశాగా దేశాన్ని కేసీఆర్ నడిపించగలర‌ని ఆయ‌న అన్నారు. తెలంగాణ‌లో అమ‌ల‌వుతున్న ప్ర‌జా సంక్షేమ ప‌థ‌కాలు దేశ‌వ్యాప్తంగా అమ‌ల్లోకి రావాల‌నీ, దీని కోసం కేసీఆర్ నాయ‌క‌త్వం అవ‌స‌ర‌మ‌ని బాల్కా సుమ‌న్ పేర్కొన్నారు. 

ట్విట్టర్ వేదికగా కూడా సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని కోరారు. సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో..  "ఎనమిదేండ్లుగా తెలంగాణ సాధించిన ప్రగతి సాక్షిగా.. 
రాష్ట్ర ప్రజలకు అందుతున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలు దేశమంతా విస్తరించాలి. జై కేసీఆర్!! జై తెలంగాణ!! జైహింద్!! " అంటూ ట్వీట్ చేశారు. 

 

"కేంద్రంలోని న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ దుర్మార్గపు పాల‌న ఈ దేశంలో న‌డుస్తోంది. ఏనిమిదేండ్లుగా ఈ దేశంలో ఏ ఒక్క వ‌ర్గానికి న్యాయం చేయ‌కుండా, అన్ని వ‌ర్గాల వారిని న‌ట్టేటముంచుతూ..ఒక రాక్ష‌స పాల‌న‌ను కేంద్రంలో బీజేపీ కొన‌సాగిస్తున్న‌ది. రైతుల‌కు గానీ, గిరిజ‌నుల‌కు గానీ, ఆదివాసీల‌కు గానీ, మైనార్టీల‌కు, యువ‌త‌కు, మ‌హిళ‌ల‌కు ఇలా ఏ ఒక్క వ‌ర్గానికి కూడా కేంద్రంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ చేసిందేమీ లేదు" అని బాల్కా సుమ‌న్ విమ‌ర్శించారు. "ప్రజాస్వామ్య పునాదులను, ప్రజాస్వామ్య బద్దంగా నడవాల్సిన వ్యవస్థలన్నింటిని ధ్వసం చేస్తూ దేశాన్ని 100 సంవత్సరాల వెనక్కు తీసుకువెళ్లే ఒక చేతగాని, అసమర్థ, దద్దమ్మల పాలన బీజేపీ నరేంద్ర మోడీ నాయకత్వంలో కొనసాగుతోందని" ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios