రేఖానాయక్ నామినేషన్లో తప్పులు: కలెక్టర్ నిర్ణయమే కీలకం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ అసెంబ్లీ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న నామినేషన్ పై గందరగోళం నెలకొంది.
ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ అసెంబ్లీ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న నామినేషన్ పై గందరగోళం నెలకొంది.ఖానాపూర్ అసెంబ్లీ స్థానం నుండి గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన రేఖానాయక్ విజయం సాధించారు. కేసీఆర్ ఈ దఫా కూడ ఆమెకే టికెట్టు కేటాయించారు.
ఖానాపూర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా రేఖా నాయక్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఈ నామినేషన్లో తప్పులు ఉన్నట్టుగా రిటర్నింగ్ అధికారులు గుర్తించారు. రేఖానాయక్ దాఖలు చేసిన మూడు సెట్లలోనూ ఓ కాలమ్ ఖాళీగా ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. ఈ విషయమై ఏం చేయాలనే దానిపై జిల్లా కలెక్టర్కు సమాచారాన్ని ఇచ్చారు రిటర్నింగ్ అధికారి.
జిల్లా కలెక్టర్ నిర్ణయం కోసం రిటర్నింగ్ అధికారి ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే రేఖా నాయక్ నామినేషన్ ను తిరస్కరించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.