Challa Harishankar slams Bandi Sanjay: బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ మాట్లాడుతూ బీజేపీ నాయకులు బండి సంజయ్ కుమార్, కాషాయ పార్టీ మరో నాయకుడు, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తమ రాజకీయ లబ్ధి కోసం మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

Telangana assembly elections 2023: బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ మాట్లాడుతూ బీజేపీ నాయకులు బండి సంజయ్ కుమార్, కాషాయ పార్టీ మరో నాయకుడు, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తమ రాజకీయ లబ్ధి కోసం మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. అయితే, వారి మాటలను ప్రజలు నమ్మరని, రాబోయే ఎన్నికల్లో వారిని ఓడించడం ఖాయమని ఆయన పేర్కన్నారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకుడు, ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖర్ రావు (కేసీఆర్), మంత్రి కేటీఆర్ పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తిరుగులేని నాయకుడిగా తెలంగాణ కలను సాకారం చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందనీ, అలాంటి నాయకుడిపై నీచమైన వ్యాఖ్యలు చేయడం తగదన్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

మరోవైపు కేటీఆర్ మంచి ఉద్యోగాన్ని వదిలేసి తెలంగాణ సాధన కోసం ఉద్యమంలో పాల్గొన్నారని అన్నారు. రాష్ట్ర ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో బండి సంజయ్ ఎక్కడా కనపించలేదు అని విమర్శించారు. సమస్యాత్మక ప్రాంతంగా వుండగా, సిరిసిల్ల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన సిరిసిల్ల దిశను మార్చిన ఘనత ఎమ్మెల్యేగా కేటీఆర్ కే దక్కుతుందని, బండి సంజయ్ తన భాషను గుర్తుంచుకోవాలని హరిశంకర్ హితవు పలికారు.

కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, 7 స్థానాలకు అభ్యర్థుల కొరత కారణంగా ఇతర పార్టీల నుంచి అభ్యర్థులను తీసుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు కావడంతో ఆ పార్టీ మళ్లీ సింగిల్ డిజిట్ కే పరిమితం కానుందని అన్నారు. 13 మంది బీజేపీ కార్పొరేటర్లు పార్టీలో ఉండేందుకు సిద్ధంగా లేరని హరిశంకర్ తెలిపారు. ఇదిలావుండగా, తెలంగాణ అసెంబ్లీ కి నవంబర్ 30 ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.