Asianet News TeluguAsianet News Telugu

దారుణం.. నోట్లో నుంచి ‘ఉమ్ము’ పడిందని.. చిన్నారిని చితకబాదిన టీచర్...

తరగతి గదిలోకి వచ్చేందుకు ఉపాధ్యాయురాలు అనుమతి అడుగుతున్న క్రమంలో అతని నోట్లో నుంచి Spit కింద పడింది. దాంతో క్లాసులో ఉన్న టీచర్ శ్వేతకు కోపం నషాలానికి అంటింది. ఆగ్రహంతో ఊగిపోతూ ఆమె కర్రతో బాలుడిని చితకబాదింది. అంతటితో ఊరుకోకుండా చేతులు, కాళ్లు, ముఖంపై Beatingతో చర్మం కమిలి పోయింది. 

teacher thrashing students in shankarpally due to spitting while asking permission
Author
Hyderabad, First Published Oct 29, 2021, 9:50 AM IST

శంకర్పల్లి :  క్లాసులోకి వచ్చేందుకు అనుమతి అడుగుతుండగా నోట్లో నుంచి ఉమ్ము కింద పడిందని ఆగ్రహించిన ఉపాధ్యాయురాలు విద్యార్థిపై కర్కశంగా వ్యవహరించింది. విచక్షణారహితంగా చితకబాదింది. దీంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.

ఈ సంఘటన శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఫత్తేపూర్‌ ప్రభుత్వ పాఠశాలలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.  గ్రామానికి చెందిన సాయిలు,  లతా దంపతుల కుమారుడు సంజీవ్ కుమార్ (8) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. 

తరగతి గదిలోకి వచ్చేందుకు ఉపాధ్యాయురాలు అనుమతి అడుగుతున్న క్రమంలో అతని నోట్లో నుంచి Spit కింద పడింది. దాంతో క్లాసులో ఉన్న టీచర్ శ్వేతకు కోపం నషాలానికి అంటింది. ఆగ్రహంతో ఊగిపోతూ ఆమె కర్రతో బాలుడిని చితకబాదింది. అంతటితో ఊరుకోకుండా చేతులు, కాళ్లు, ముఖంపై Beatingతో చర్మం కమిలి పోయింది. 

సాయంత్రం ఇంటికి వచ్చిన బాలుడి ఒంటిపై ఉన్నflogging చూసి చలించిపోయిన తల్లిదండ్రులు ఉపాధ్యాయురాలిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై శ్వేతను నిలదీయగా.. మీ అబ్బాయికి Discipline లేదు అందుకే కొట్టాను.. అని బదులిచ్చింది. కేసు దర్యాప్తులో ఉంది.

సస్పెన్షన్ వేటు..
విద్యార్థి సంజీవ్ కుమార్ ను చితకబాదిన ఉపాధ్యాయురాలిని  జిల్లా విద్యాధికారి Suspend చేసినట్లు మండల విద్యాధికారి అక్బర్ తెలిపారు.  విద్యార్థి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపామని తెలిపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న  శ్వేత పై  డిఈఓ  సుశీల్ రావు గురువారం వేటు వేశారు.

అర్థనగ్నంగా ఉండమంటాడు.. మూత్రం తాగమంటాడు.. ఓ భర్త పైశాచికత్వం...

జూబ్లీహిల్స్ లో ఓ భర్త దారుణం..
ఇదిలా ఉండగా.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యకు ఓ భర్త నరకం చూపించాడు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు మరో మచ్చు తునక ఈ ఘటన. వేరే కులం, తక్కువ కులం అమ్మాయి అని.. కులం పేరుతో దూషించడం మొదలుపెట్టాడు. దీనికి తోడు అబార్షన్లు చేయించి చిత్రహింసలు గురిచేశాడు. అంతటితో ఆగలేదు కుటుంబమంతా కలిసి వేదించారు. 

దీంతో ఆ మహిళ తట్టుకోలేక... తనను కులం పేరుతో దూషిస్తూ, తీవ్రంగా కొడుతూ.. అర్థ నగ్నంగా ఉండమంటాడని, urine తాగాలని బలవంతం చేస్తాడని ఓ మహిళ తన భర్త ఆగడాలపై జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. 

అతని కుటుంబ సభ్యులూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. నారాయణపేట మక్తల్ కు చెందిన మహిళ రహమత్ నగర్ లో నివసిస్తుంది. ఆమె 2016లో ఓ యువకుడిని ప్రేమించి, పెళ్లి చేసుకుంది. 

ఆ తరువాత ఆమె గర్భం దాల్చింది. అయితే ఇప్పుడే పిల్లలు వద్దూ అంటూ ఆమెకు abortion చేయించారు. 2020లో భర్త సోదరుడు, సోదరి, బావ ఆమెను cast పేరుతో దూషించేవారు. పలుమార్లు పెట్రోల్ పోసి చంపేస్తామంటూ బెదిరింపులకు దిగేవారు.

దీంతో ప్రేమ, పెళ్లి కట్నం లేకపోవడంతో సతాయిస్తున్నారని.. భర్తకు రూ.1.50 లక్షలు ఇచ్చింది. ఆ తర్వాత కూడా వేధింపులు ఆపలేదు. ఇక భర్త మరీ దారుణం Half nakedగా కూర్చోవాలని వేదించేవాడు. అంతకంటే దారుణం మూత్రం తాగాలని బలవంతం చేసేవాడు. ఈ మేరకు నిందితులపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios