Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ కు దమ్ముంటే ఆ పని చేయాలి.. తరుణ్ చుగ్ సవాల్...

మునుగోడు ఎన్నికల్లో భారీ మెజారిటీ దక్కకపోవడంతో కేసీఆర్ వెన్నులో వణుకు పుడుతోందని.. వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయం అన్న భయం పట్టుకుందని తరుణ్ చుగ్ ఎద్దేవా చేశారు. 

Tarun Chugh challenges KCR over munugodu bypoll
Author
First Published Nov 10, 2022, 8:41 AM IST

హైదరాబాద్ : కెసిఆర్ కు దమ్ముంటే ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి వచ్చిన నిధులు, 2014 తర్వాత వచ్చిన నిధులపై బహిరంగ చర్చకు రావాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ సవాల్ విసిరారు. మునుగోడులో ఆశించిన భారీ మెజారిటీ దక్కక పోవడంతో, రానున్న ఎన్నికల్లో ఓటమి ఖాయం అని కేసీఆర్ ఆందోళన చెందుతున్నారని ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రతి కార్యక్రమంలో  కేంద్రం భాగస్వామ్యం ఉందని ఆయన స్పష్టం చేశారు,  రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించి జాతికి అంకితం ఇచ్చేందుకు ఈ నెల 12న వస్తున్న ప్రధాని మోడీ పర్యటనలో సిపిఐ, సిపిఎంలతో కలిసి సమస్యలు సృష్టించేందుకు కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ఇదిలా ఉంటే, తెలంగాణపై ప్రధాని మోడీ కొత్త నాటకం ఆడుతున్నారని టిఆర్ఎస్ ఎంపీ బడుగు లింగయ్య యాదవ్ మండిపడ్డారు. రాష్ట్రంపై ఏవిధంగా పగ తీర్చుకోవాలన్నట్లు కేంద్రం వ్యవహరిస్తోందని అన్నారు. ఏడాదిగా పనిచేస్తున్న ఫ్యాక్టరీని  మళ్లీ ప్రారంభించడం ఏమిటని ప్రశ్నించారు. ఈ నెల 12న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు ప్రధాని వస్తుంటే ప్రోటోకాల్ పాటించని దుస్థితికి కేంద్ర ప్రభుత్వం చేరిందని విమర్శించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్  బుధవారం మీడియాతో మాట్లాడారు. 

మొయినాబాద్ ఫాంహౌస్ కేసు.. నిందితులకు రెండు రోజుల పోలీస్ కస్టడీ, కండీషన్స్ అప్లయ్

రామగుండం వస్తున్న ప్రధాని మోదీ ముందుగా తెలంగాణకు ఏమి ఇవ్వనున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. దాదాపు మూడు లక్షల కోట్లకుపైగా కేంద్రానికి రాష్ట్రం పన్నుల ఆదాయం పంపిణీ..  తెలంగాణకు రూ.1.60 లక్షల కోట్లు కూడా తిరిగి ఇవ్వలేదని అన్నారు. విభజన హామీల అమలు విషయంలోనూ ఎలాంటి పురోగతి లేదని..  కృష్ణ, గోదావరి, నీటి సమస్యలు ఇంకా పరిష్కరించలేదని ధ్వజమెత్తారు. ఎన్నికలు ఉన్నందున నెలరోజుల్లోనే రూ. లక్ష కోట్లకు పైగా గుజరాత్ కు ఇచ్చారని ఆరోపించారు. 

మోడీ కేవలం గుజరాత్ కే ప్రధానా? లేక దేశం మొత్తానికా? అని ప్రశ్నించారు. కేంద్రం బీజేపీ పాలిత రాష్ట్రాలను ఒక రకంగా,  బీజేపీయేతర పాలిత రాష్ట్రాలను మరో రకంగా ట్రీట్ చేస్తోందని మండిపడ్డారు. ప్రధానికి ఏనాడూ తెలంగాణ మీద ప్రేమ లేదని లింగయ్య యాదవ్ విమర్శించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios