పేపర్ లీక్ కేసులో ట్విస్ట్.. తెరపైకి కొత్త పేర్లు, 42 మంది టీఎస్పీఎస్సీ ఉద్యోగులకు సిట్ నోటీసులు
పేపర్ లీక్ కేసుకు సంబంధించి టీఎస్పీఎస్సీలో పనిచేస్తున్న 42 మందికి నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు. అలాగే రాజశేఖర్ రెడ్డి స్నేహితుడు సురేష్ పాత్రపై సిట్ పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది.

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసుకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తెరపైకి మరికొన్ని కొత్త పేర్లు వస్తున్నాయి. ప్రధానంగా రాజశేఖర్ రెడ్డి స్నేహితుడు సురేష్ పాత్రపై సిట్ పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. టీఎస్పీఎస్సీ నుంచి ఇతనే పేపర్ను బయటకు తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో సురేష్ ఎంతమందికి పేపర్ ఇచ్చాడన్న దానిపై సిట్ ఆరా తీస్తోంది. ప్రవీణ్, రాజశేఖర్ల పెన్డ్రైవ్లలో సమాచారం లీకైనట్లు సిట్ గుర్తించింది. రాజశేఖర్ వాట్సాప్ చాటా ఆరా తీసింది సిట్. అలాగే టీఎస్పీఎస్సీలో పనిచేస్తున్న 42 మందికి నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు. ఈ రోజు 9 మంది నిందితులను 7 గంటల పాటు ప్రశ్నించింది సిట్. దీనితో పాటు పలు అంశాలపై ఆధారాలను సేకరించింది సైబర్ క్రైమ్ టెక్నికల్ టీమ్.
మరోవైపు.. ఈ కేసులో అరెస్టైన నిందితులు రాజశేఖర్, ప్రవీణ్, రేణుక ఆమె భర్త ఢాక్యానాయక్ బ్యాంకు ఖాతాలను సిట్ బృందం పరిశీలించింది. ఇ వల కాలంలో ఈ నిందితుల ఖాతాల్లో అనుమానాస్పద లావాదేవీలు జరిగాయా అనే కోణంలో కూడా సిట్ ఆరా తీస్తోంది. ఈ కేసులో అరెస్టైన రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగా సురేష్ను కూడా సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సిట్ విచారిస్తున్న సురేష్ కు గ్రూప్-1 పరీక్షలో 100 మార్కులు వచ్చినట్టుగా సమాచారం. ఈ విషయమై పోలీసులు విచారణ చేస్తున్నారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం విక్రయించి రేణుక డబ్బులు సంపాదించిందని సిట్ గుర్తించింది. నీలేష్, గోపాల్ లకు ప్రశ్నాపత్రాలు ఇచ్చి రూ. 14 లక్షలను రేణుక తీసుకుందని సిట్ గుర్తించింది.
Also REad: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్: పెన్ డ్రైవ్ ల్లో క్వశ్చన్ పేపర్లు,మరో 10 మందికి నోటీసులు
టీఎస్పీఎస్సీ కాన్పిడెన్షియల్ సెక్షన్ సూపరింటెండ్ శంకరలక్ష్మిని సిట్ అధికారులు మంగళవారం రాత్రి విచారించారు. శంకరలక్ష్మీ ఇచ్చిన సమాచారం మేరకు ప్రవీణ్ ను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి ల నుండి పెన్ డ్రైవ్ లను సిట్ బృందం సీజ్ చేసింది. ఈ పెన్ డ్రైవ్ లలో ప్రశ్నాపత్రాలు ఉన్నట్టుగా సిట్ బృందం గుర్తించింది.