ఏసీ టాయిలెట్టు... సిద్దిపేట ర్యాంకు కొట్టు
సీఎం కేసీఆర్ సొంత జిల్లా సిద్ధిపేట మరోసారి రికార్డులకెక్కనుంది.
స్వచ్ఛ భారత్ కు దేశం సగం దూరంలో కూడా లేదు. కానీ, సీఎం కేసీఆర్ జిల్లా అప్పుడే స్వచ్ఛత దాటి ఏసీ వైపు పరుగులు తీస్తోంది. దానికి ఉదాహరణే ఈ ఏసీ టాయిలెట్లు.
దేశంలోని మొదటిసారిగా మహిళల కోసం షీ టాయిలెట్స్ పేరుతో ఏసీ టాయిలెట్లను సిద్దిపేటలో ఏర్పాటు చేశారు ఇక్కడి మున్సిపల్ అధికారులు.
స్వచ్ఛ సర్వేక్షన్ లో ర్యాంకు సాధించాలనే ఉద్దేశంతో ఇలా సెంట్రలైజ్డ్ ఏసి టాయ్ లెట్స్ ను తీసుకొచ్చారు. ఒకసారి ఏనిమిది మంది ఉపయోగించుకునేలా వీటిని డిజైన్ చేశారు. పబ్లిక్ ప్రదేశాలలో, ఆర్టీసీ బస్టాండులలో వీటిని వినయోగంలోకి తేనున్నారు.
కాగా, సిద్దిపేటగా నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటి బహిరంగ మలవిసర్జన రహిత నియోజకవర్గంగా పేరొందిన విషయం తెలిసిందే.