Asianet News TeluguAsianet News Telugu

బ్లాక్ మనీని వైట్‌గా మార్చేందుకే, వారంతా అందుకే ఇలా.. కీలక విషయాలు చెప్పిన శిల్పా చౌదరి

కిట్టీ పార్టీల పేరుతో సినీ, రాజకీయ ప్రముఖులను కోట్లాది రూపాయల మేర మోసం చేసిన కిలాడీ లేడీ శిల్పా చౌదరి కేసులో తొలి రోజు కస్టడీ విచారణ ముగిసింది. ఈ సందర్భంగా శిల్పా చౌదరి బోరున విలపించినట్లుగా తెలుస్తోంది. విచారణలో భాగంగా ఆమె బ్యాంక్ స్టేట్‌మెంట్లపై ఆరా తీశారు పోలీసులు.

Shilpa Chowdary first day custody updates
Author
Hyderabad, First Published Dec 3, 2021, 6:05 PM IST

కిట్టీ పార్టీల పేరుతో సినీ, రాజకీయ ప్రముఖులను కోట్లాది రూపాయల మేర మోసం చేసిన కిలాడీ లేడీ శిల్పా చౌదరి కేసులో తొలి రోజు కస్టడీ విచారణ ముగిసింది. ఈ సందర్భంగా శిల్పా చౌదరి బోరున విలపించినట్లుగా తెలుస్తోంది. విచారణలో భాగంగా ఆమె బ్యాంక్ స్టేట్‌మెంట్లపై ఆరా తీశారు పోలీసులు. శిల్పా చౌదరి స్టేట్‌మెంట్లను రికార్డు చేశారు నార్సింగి పోలీసులు. జనం నుంచి వసూలు చేసిన రూ.కోట్లు ఎక్కడికి తరలించిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. శిల్పా చౌదరి కాల్‌డేటాలోని కొంతమంది వ్యక్తులను సంప్రదించినట్లు పోలీసులు భావిస్తున్నారు. తనకు డబ్బు ఇచ్చిన వారు చాలా మంది అప్పుగా ఇచ్చారని.. కొందరు బ్లాక్ మనీని ఇన్వెస్ట్‌మెంట్ల ద్వారా వైట్‌గా మార్చేందుకు ఇచ్చారని శిల్పా చౌదరి చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. 

కాగా.. శిల్పా చౌదరికి న్యాయస్థానం నిన్న షాకిచ్చింది. ఆమె బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. అయితే శిల్పా చౌదరి  భర్తకు మాత్రం బెయిల్ మంజూరు చేసింది. అనంతరం శిల్పా చౌదరిని 5 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. మరోవైపు మహిళలకు మాయమాటలు చెప్పి వారి వద్ద నుంచి రూ. కోట్లు కాజేసిన shilpa chowdary మోసాల్లో మరో కోణాన్ని పోలీసులు తెలుసుకున్నారు. Divanos పేరుతో జూదశాలను నిర్వహించిందని సాక్ష్యాధారాలు సేకరించారు.  ఇందులో 90 మంది సెలబ్రిటీల కుటుంబాల మహిళలు ఉన్నారని గుర్తించారు. శిల్పా చౌదరి జైల్లో ఉందని తెలుసుకున్న ఆమె బాధితులు తమ వద్ద కూడా రూ. కోట్లలో నగదు తీసుకుని మోసం చేశారంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.  గండి పేటలోని  సిగ్నేచర్ విల్లాలో పదేళ్లుగా నివాసముంటున్న శిల్పా చౌదరి, శ్రీకృష్ణ శ్రీనివాస్ ప్రసాద్ దంపతులు తమకు తాము ధనవంతులుగా ప్రకటించుకున్నారు.

ALso Read:శిల్పా చౌదరికి కోర్టులో చుక్కెదురు, బెయిల్ తిరస్కరణ.. పోలీస్ కస్టడీకి అప్పగింత

Cine celebrities కుటుంబాల్లోని మహిళలను వారాంతాల్లో పార్టీల పేరుతో ఆహ్వానించేది.  తొలుత కొంత మందితో మొదలైన Kitty partyలను తర్వాత జూదంగా  మార్చింది. దివానోస్ పేరుతో జూదశాలను  ప్రారంభించింది.  సంపన్న కుటుంబాలకు చెందిన మహిళల్లో  90 మందిని సభ్యులుగా చేర్పించుకుంది.  వారాంతాల్లో విందులు, వినోదాలు ఏర్పాటు చేసేది. శిల్ప చౌదరి భర్త శ్రీకృష్ణ శ్రీనివాస్ ప్రసాద్ స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారన్న సమాచారంతో ఎక్కడెక్కడ భూములు కొన్నారు అన్న వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. కాగా, హీరో Mahesh Babu సోదరి ప్రియదర్శని కూడా తన వద్ద నుంచి రెండు కోట్లకు పైగా తీసుకుని శిల్పా చౌదరి మోసం చేసిందని.. కొద్ది రోజుల క్రితం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని నార్సింగి పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా బుధవారం శిల్ప చౌదరి చౌదరి పై ఓ ప్రముఖ సినీ  నటుడి భార్య కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios