Asianet News TeluguAsianet News Telugu

శిల్పా చౌదరికి కోర్టులో చుక్కెదురు, బెయిల్ తిరస్కరణ.. పోలీస్ కస్టడీకి అప్పగింత

కిట్టి పార్టీల పేరుతో సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి కోట్లాది రూపాయలను కొల్లగొట్టిన కిలాడీ లేడీ శిల్పా చౌదరికి న్యాయస్థానం షాకిచ్చింది. ఆమె బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. అయితే శిల్పా చౌదరి  భర్తకు మాత్రం బెయిల్ మంజూరు చేసింది. అనంతరం శిల్పా చౌదరిని 5 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. 

court dismissed shilpa chowdary bail plea
Author
Hyderabad, First Published Dec 2, 2021, 3:35 PM IST

కిట్టి పార్టీల పేరుతో సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి కోట్లాది రూపాయలను కొల్లగొట్టిన కిలాడీ లేడీ శిల్పా చౌదరికి న్యాయస్థానం షాకిచ్చింది. ఆమె బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. అయితే శిల్పా చౌదరి  భర్తకు మాత్రం బెయిల్ మంజూరు చేసింది. అనంతరం శిల్పా చౌదరిని 5 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. 

కాగా.. మహిళలకు మాయమాటలు చెప్పి వారి వద్ద నుంచి రూ. కోట్లు కాజేసిన shilpa chowdary మోసాల్లో మరో కోణాన్ని పోలీసులు తెలుసుకున్నారు. Divanos పేరుతో జూదశాలను నిర్వహించిందని సాక్ష్యాధారాలు సేకరించారు.  ఇందులో 90 మంది సెలబ్రిటీల కుటుంబాల మహిళలు ఉన్నారని గుర్తించారు. శిల్పా చౌదరి జైల్లో ఉందని తెలుసుకున్న ఆమె బాధితులు తమ వద్ద కూడా రూ. కోట్లలో నగదు తీసుకుని మోసం చేశారంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.  గండి పేటలోని  సిగ్నేచర్ విల్లాలో పదేళ్లుగా నివాసముంటున్న శిల్పా చౌదరి, శ్రీకృష్ణ శ్రీనివాస్ ప్రసాద్ దంపతులు తమకు తాము ధనవంతులుగా ప్రకటించుకున్నారు.

ALso Read:శిల్పా చౌదరి : కిలాడీ లేడీ ఉచ్చులో హీరో మహేష్ బాబు సోదరి.. రూ. 2 కోట్లు మోసపోయానంటూ ఫిర్యాదు...

Cine celebrities కుటుంబాల్లోని మహిళలను వారాంతాల్లో పార్టీల పేరుతో ఆహ్వానించేది.  తొలుత కొంత మందితో మొదలైన Kitty partyలను తర్వాత జూదంగా  మార్చింది. దివానోస్ పేరుతో జూదశాలను  ప్రారంభించింది.  సంపన్న కుటుంబాలకు చెందిన మహిళల్లో  90 మందిని సభ్యులుగా చేర్పించుకుంది.  వారాంతాల్లో విందులు, వినోదాలు ఏర్పాటు చేసేది. శిల్ప చౌదరి భర్త శ్రీకృష్ణ శ్రీనివాస్ ప్రసాద్ స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారన్న సమాచారంతో ఎక్కడెక్కడ భూములు కొన్నారు అన్న వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. కాగా, హీరో Mahesh Babu సోదరి ప్రియదర్శని కూడా తన వద్ద నుంచి రెండు కోట్లకు పైగా తీసుకుని శిల్పా చౌదరి మోసం చేసిందని.. కొద్ది రోజుల క్రితం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని నార్సింగి పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా బుధవారం శిల్ప చౌదరి చౌదరి పై ఓ ప్రముఖ సినీ  నటుడి భార్య కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

తన వద్ద రూ. 2.9 కోట్లను  తీసుకుందని నార్సింగి పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు శిల్పా చౌదరిని పోలీసులు అరెస్టు చేసిన తర్వాత ఆమె బాధితులు ఒక్కొక్కరుగా ఫిర్యాదులు చేస్తున్నారు. కిట్టి పార్టీల లో శిల్పా చౌదరి పరిచయం అయిందని సదరు హీరో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళల నుండి ఆమె భారీగా డబ్బులు వసూలు చేసిందని పోలీసులు గుర్తించారు.  నార్సింగి  పోలీస్ స్టేషన్లో మొత్తం మూడు కేసులు  ఆమె మీద  నమోదయ్యాయి.  

Follow Us:
Download App:
  • android
  • ios