తెలంగాణలో కొత్త మంత్రులు సచివాలయంలో విధులు మొదలుపెట్టారు. వీరిని కలవాలంటే ఏ ఫ్లోర్ లో.. ఏ గదికి వెళ్లాలో తెలుసుకోండి.. 

హైదరాబాద్ : తెలంగాణ సచివాలయంలో కొత్త మంత్రులు కొలువు దీరారు. సచివాలయంలో వారు తమకు కేటాయించిన కార్యాలయాల్లో పనులు మొదలు పెట్టారు. నూతనంగా నిర్మించిన బీఆర్అంబేద్కర్ సచివాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. వీరికి గదులు కేటాయిస్తూ ఆదివారం సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఈ మంత్రులు ఎవరెవరు ఏ అంతస్తుల్లో... ఏ నెం. గదుల్లో ఉన్నారో వివరంగా చూడండి.

నెం.మంత్రి పేరుమంత్రిత్వ శాఖఏ అంతస్తుగది నెం.
1భట్టి విక్రమార్కఆర్థిక శాఖ, ఇంధన శాఖరెండవ 10, 11, 12
2.ఉత్తమ్ కుమార్ రెడ్డిఇరిగేషన్, పౌర సరఫరాలునాలుగవ27, 28, 29
3దామోదర రాజనర్సింహవైద్యం, కుటుంబ సంక్షేమంరెండవ13, 14,15
4కోమటిరెడ్డి వెంకటరెడ్డిఆర్ అండ్ బి, సినిమాటోగ్రఫీఐదవ10, 11, 12
5శ్రీధర్ బాబు ఐటి, పరిశ్రమలుమూడవ 10, 11, 12
6పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిరెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖగ్రౌండ్ ఫ్లోర్10, 11, 12
7పొన్నం ప్రభాకర్ట్రాన్స్ పోర్ట్, బీసీ సంక్షేమ శాఖఐదవ27, 28, 29
8కొండా సురేఖఅటవీ, పర్యావరణం, దేవాదాయ శాఖనాలుగవ10, 11, 12
9సీతక్కపిఆర్, ఆర్ డి, మహిళా శిశు సంక్షేమంమొదటి27, 28, 29
10తుమ్మల నాగేశ్వరరావువ్యవసాయం, మార్కెటింగ్, కో-ఆపరేటివ్మూడవ27, 28, 29
11.జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్, టూరిజం నాలుగవ13,14,15