కరోనా కారణంగా దక్షిణ మధ్య రైల్వే 55 రైళ్లను రద్దు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నడిచే 55 రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. 

అమరావతి: Corona కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకొంది. 
కేసులు మూడు లక్షల మార్క్‌ను దాటాయి. అంతేకాకుండా Omicron కేసులు కూడా పెరుగుతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా 55 రై Trains రద్దు చేసినట్టు ప్రకటించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Andhra Pradesh, Telangana రాష్ట్రాల్లో ఇవాళ్టి నుంచి 24 వరకు 55 ప్యాసింజర్ Trains ను రద్దు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది. కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలోనే రైళ్లను రద్దు చేసినట్లు South Central Railway

దేశంలో నిన్న 3,47,254 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 703 మంది మరణించారు. వైరస్ నుంచి 2,51,777 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 17.94 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,85,66,027 చేరింది. ‬ కరోనాతో ఇప్పటి వరకు మొత్తం 4,88,396 మంది మరణించారు. దేశంలో ప్రస్తుతం 20,18,825 ‬యాక్టివ్ కేసులు ఉన్నాయి.