సరూర్నగర్ పోలీస్ స్టేషన్ లో కన్న కొడుకుకు చిత్రహింసలు పెట్టారని నమోదైన కేసులో ట్విస్ట్ చేసుకొంది. కోర్టు అనుమతితో తన వద్ద ఉన్న కొడుకును బలవంతంగా తీసుకెళ్లారని సంతోష్ కుమార్ ఫిర్యాదు చేయడంతో భార్యపై కూడా కేసు నమోదైంది
హైదరాబాద్: కన్న కొడుకుని చిత్రహింసలు పెట్టారనే ఫిర్యాదుపై ఓ Advocate పై Saroornagar పోలీసులు Case నమోదు చేశారు. అయితే తన వద్ద ఉన్న sonను బలవంతంగా తీసుకెళ్లారని న్యాయవాది ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
సరూర్ నగర్ డాక్టర్స్ కాలనీలో నివసించే న్యాయవాది Devulapalli Santosh kumar కు Uma Maheshwari తో 11 సంవత్సరాల క్రితం పెళ్లైంది. వీరికి అర్షిత్సాయి (10), కల్యాణ్సాయి (8) కుమారులు ఉన్నారు.
భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావటంతో వేర్వేరుగా ఉంటున్నారు. అయితే నాలుగు నెలల క్రితం ఇద్దరు కొడుకులను కోర్టు ఆర్డర్ ద్వారా సంతోష్ కుమార్ తన వద్దకు తెచ్చుకొన్నాడు.
ఇదిలా ఉండగా సోమవారం గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఉమామహేశ్వరికి ఫోన్కాల్ వచ్చింది. తప్పిపోయిన మీ కుమారుడు తమ వద్ద ఉన్నాడని చెప్పాడు. అక్కడికి వెళ్లిన ఉమామహేశ్వరికి తన పెద్ద కుమారుడు అర్షిత్సాయి కనిపించాడు. ఒంటిపై గాయాలు ఉన్నాయని ఆమె పోలీసులకు వివరించింది.
తనను తండ్రి సంతోష్కుమార్, ఆయనతో పాటు ఉంటున్న టీచర్ స్వాతి చిత్రహింసలు పెట్టారని తనకు వివరించాడని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొంది. స్వాతి టీచర్ గరిటెతో పొట్టపై వాతలు పెట్టిందని, తండ్రి బెల్ట్తో కొట్టాడని తన కొడుకు చెప్పాడని ఉమామహేశ్వరి సరూర్నగర్ పోలీసులకు వివరించింది. తనపై కోపంతో తమ కుమారుడిని చిత్రహింసలు పెట్టిన భర్త సంతోష్కుమార్, స్వాతిపై చర్యలు తీసుకోవాలని కోరింది.
తన కుమారుడు అర్షిత్ సాయిని తాము చిత్రహింసలు పెట్టిన మాట వాస్తవం కాదని సంతోష్ కుమార్ పోలీసులకు చెప్పారు. కోర్టు అనుమతితో తీసుకొచ్చిన తన కుమారుడిని ఉమామహేశ్వరి, ఆమె సోదరుడు శివకుమార్ బలవంతంగా తీసుకెళ్లారని సంతోష్ కుమార్ సరూర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇరువురి ఫిర్యాదు స్వీకరించి రెండు కేసులు నమోదు చేసినట్లు SI Madhava Rao తెలిపారు
