Road Accident: కొడంగల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
Road Accident: వికారాబాద్ జిల్లాలోని కొడంగల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
హైదరాబాద్లోని కూకట్పల్లికి చెందిన ముగ్గురు బాధితులు కర్ణాటకలోని దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని సందర్శించి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానిక ఎస్సై సత్యనారాయణ తెలిపారు. చిట్లపల్లి - యలమద్ది గ్రామాల మధ్య జాతీయ రహదారిపై వారి కారును ఒక SUV ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురూ అక్కడికక్కడే మరణించారు.
మృతదేహాలను కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
