Asianet News TeluguAsianet News Telugu

మద్యం చేసిన హత్యలు.. తాగి, రాంగ్ రూట్ లో వస్తూ ముగ్గురి బలి తీసుకున్న లారీ డ్రైవర్..

మద్యంమత్తులో.. రాంగ్ రూట్లో అతివేగంగా లారీ నడిపి ముగ్గుర్ని బలి తీసుకున్నాడో లారీ డ్రైవర్. ఈ ఘటన సిద్దిపేటలో చోటు చేసుకుంది. 

road accident in karimnagar, three dead
Author
Hyderabad, First Published Jun 13, 2022, 9:11 AM IST

కరీంనగర్ : మద్యం తాగి లారీ నడుపుతూ… అదీ రాంగ్ రూట్ లో అతి వేగంగా వస్తూ.. ముగ్గురి ప్రాణాలను బలిగొన్నాడు ఓ లారీ డ్రైవర్. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం, మల్లారం శివారు రాజీవ్ రహదారిపై ఆదివారం ఉదయం 10:30 సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. కరీంనగర్ పట్టణానికి చెందిన రిటైర్డ్ అధ్యాపకులు తాండ్ర పాపారావు(62), ఆయన భార్య పద్మ(56) ఓ అద్దెకారులో కరీంనగర్ నుంచి హైదరాబాద్కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కారును అదే జిల్లాలోని నాగుల మల్యాలకు చెందిన గొంటి ఆంజనేయులు(48) నడుపుతున్నారు. 

మల్లారం శివారులోకి రాగానే ఎదురుగా రాంగ్రూట్లో వేగంగా వస్తున్న లారీ ముందు నుంచి కారును ఢీకొట్టింది. దీంతో  కారులోని ముగ్గురికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలు కారులోనే ఇరుక్కుపోయాయి. లారీ డ్రైవర్ కాళ్లూ, చేతులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను జేసీబీ సహాయంతో బయటికి తీసి సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

వనపర్తి జిల్లా జూరాలకు చెందిన లారీ డ్రైవర్ శ్రీనివాస్ తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పద్మ సోదరుడు శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లారీడ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ గొంటి ఆంజనేయులుకి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

హైదరాబాద్ : మియాపూర్‌లో తుపాకులతో సంచరిస్తున్న ముగ్గురు యువకులు, అరెస్ట్

మనవడిని చూడకుండానే..
పాపారావు,  పద్మ దంపతుల కుమారుడు ప్రీతమ్ రావు రెండేళ్ల కిందట అమెరికా వెళ్లి అక్కడే ఉంటున్నాడు. ఇటీవల ప్రీతం రావుకు కొడుకు పుట్టడంతో మనవడిని చూసేందుకు వారం, పది రోజుల్లో అమెరికా పయనానికి దంపతులు సిద్ధమవుతున్నారు.  ఇంతలోనే ఊహించని ప్రమాదంలో ఇద్దరూ కన్నుమూశారు.

కాగా, జూన్ 9న అంత్యక్రియల కోసం వెళుతూ భార్యభర్తలతో పాటు మరో మహిళ రోడ్డు ప్రమాదంలో అనంతలోకాలకు చేరుకున్న దారుణం యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది.  మృతులు ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో తీవ్ర విషాదం నెలకొంది. వివరాల్లోకి వెడితే.. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం టేకులసోమారం గ్రామానికి చెందిన దండెబోయిన నర్సింహ, రాజ్యలక్ష్మి భార్యాభర్తలు. బొమ్మలరామారం మండలం చౌదరిపల్లిలో వీరి బంధువు చనిపోవడంతో భార్యతో పాటు వదిన జంగమ్మను తీసుకుని నర్మింహ బైక్ పై బయలుదేరాడు. 

భువనగిరి పట్టణ సమీపంలోని హనుమపూర్ బచ్పన్ స్కూల్ వద్ద వీరు ప్రయాణిస్తున్న బైక్ ను అతివేగంతో వచ్చిన డిసీఎం ఢీకొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న నర్సింహతో పాటు వెనకాల కూర్చున్న ఇద్దరు మహిళలు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి రోడ్డుపై రక్తపుమడుగులో పడిపోయారు. తీవ్ర గాయాలతో ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. రోడ్డుపై పడివున్న మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. అనంతరం కేసు నమోదు  చేసి దర్యాప్తు చేపట్టారు. 

Follow Us:
Download App:
  • android
  • ios