కుప్పకూలిన రెడీమిక్స్ ప్లాంట్: నలుగురి పరిస్థితి విషమం
హైద్రాబాద్ షేక్పేటలో నిర్మాణ స్థలంలో బుధవారం నాడు రెడీమిక్స్ ప్లాంట్ కుప్పకూలింది. శిథిలాల కింద నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాద్: హైద్రాబాద్ షేక్పేటలో నిర్మాణ స్థలంలో బుధవారం నాడు రెడీమిక్స్ ప్లాంట్ కుప్పకూలింది. శిథిలాల కింద నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
షేక్పేట ఓయూ కాలనీ ఓ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది.. ఓ భవనం నిర్మిస్తున్న ప్రాంతంలో రెడీమిక్స్ ప్లాంట్ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో అక్కడ పనిచేస్తున్న నలుగురు కార్మికులు రెడీమిక్స్ ప్లాంట్ కింద చిక్కుకుని గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
క్షతగాత్రుల్లో ఒకరికి చేయి విరిగినట్టు సమాచారం. ఈ ప్లాంట్ సమీపంలోనే భవనం వద్ద సుమారు 150 మంది దుర్గా మాత పూజలో ఉన్నారు. ఈ ప్లాంట్ విడి భాగాలు వారిపై పడితే ప్రమాద తీవ్రత మరింత పెరిగేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.