నౌహీరా షేక్కు రిమాండ్ విధించిన రంగారెడ్డి కోర్టు
నౌహీరా షేక్ను సైబరాబాద్ పోలీసులు మంగళవారం నాడు రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపర్చారు. నౌహీరాకు 14 రోజుల పాటు జ్యూడీషీయల్ రిమాండ్ విధిస్తూ కోర్టు మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్: నౌహీరా షేక్ను సైబరాబాద్ పోలీసులు మంగళవారం నాడు రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపర్చారు. నౌహీరాకు 14 రోజుల పాటు జ్యూడీషీయల్ రిమాండ్ విధిస్తూ కోర్టు మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేసింది.
వచ్చే నెల 12 వ తేదీ వరకు నౌహీరా జ్యూడీషీయల్ రిమాండ్లో ఉంటుంది. ఇదిలా ఉంటే వారం రోజుల పాటు నౌహీరా షేక్ను తమ కస్టడీకి ఇవ్వాలని సైబరాబాద్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.