Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్ న్యూస్.. రాజ్ భవన్ లో రాఖీ వేడుకలు రద్దు

ప్రతి ఏడాది రాజ్‌భవన్‌లో రాఖీ వేడుకలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కానీ ఈ ఏడాది కేరళ వరదల నేపథ్యంలో రాఖీ వేడుకలను రద్దు చేసుకుంటున్నట్లు గవర్నర్ చెప్పారు.

rakhi celebrations canceled in rajbhavan
Author
Hyderabad, First Published Aug 24, 2018, 5:20 PM IST

రాఖీ పండగ వచ్చిందంటే చాలు.. రాజ్ భవన్ లో సంబరాలు మొదలైపోతాయి. స్కూల్ పిల్లలు సహా.. అందరూ.. అక్కడికి వెళ్లి గవర్నర్ కి రాఖీ కడుతూ ఉంటారు. కానీ.. ఈ ఏడాది ఆ సందడి ఉండటం లేదు.


కేరళ వరదల నేపథ్యంలో రాఖీ వేడుకలను రద్దు చేసుకుంటున్నట్లు గవర్నర్ నరసింహన్ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ప్రజలు తమకు తోచినంతగా.. కేరళ రాష్ర్టానికి సాయం చేయాలని గవర్నర్ పిలుపునిచ్చారు. ప్రతి ఏడాది రాజ్‌భవన్‌లో రాఖీ వేడుకలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కానీ ఈ ఏడాది కేరళ వరదల నేపథ్యంలో రాఖీ వేడుకలను రద్దు చేసుకుంటున్నట్లు గవర్నర్ చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios