ప్రభుత్వానికి ఎంబీటీ డిమాండ్

విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న ఎమ్మేల్యే రాజా సింగ్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి మజ్లిస్ బజావో తెహ్రీక్ (ఎంబీటీ) తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా అతనిపై ఎలాంటి కేసులు నమోదు చేయడం లేదని ఆరోపించింది. రాజా సింగ్ ను విచారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. సోమవారం చంచల్ గూడలోని ఎంబీటీ కార్యాలయంలో మాజీ కార్పొరేటర్ అంజదుల్లా ఖాన్ మాట్లాడుతూ.. రాజా సింగ్ పై అనేక కేసులు నమోదై ఉన్నాయని, అయితే గత ప్రభత్వంతో పాటు ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అతనిపై చర్యలు తీసుకోడానికి వెనకాడుతున్నాయని ఆరోపించారు. ఆరేళ్ల నుంచి అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న రాజాసింగ్ పై పోలీసులు ఇప్పటి వరకు చార్జషీట్ కూడా తెవరలేదని విమర్శించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred