Asianet News TeluguAsianet News Telugu

టీఆర్ఎస్ డేటాతో మాట్లాడితే- రేవంత్ రెడ్డి నోటి తీటతో మాట్లాడతాడు.. జీవన్ రెడ్డి..

మల్లారెడ్డి టు మై హోం, మేఘా టు నవాయుగ వరకు రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ దందా ఎవరిని అడిగినా చెప్తారన్నారు. రేవంత్ హోల్ సేల్ బ్లాక్ మెయిల్ బ్రాండ్ అంబాసిడర్ అని, చీకటి పనులకు రేవంత్ నెంబర్ వన్ బ్రాండ్ అంబాసిడర్ అని మండిపడ్డారు. 

PUC Chairman Jeevan Reddy, MLC Mallesham press meet
Author
Hyderabad, First Published Sep 14, 2021, 1:44 PM IST

టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మంగళవారం పియూసీ చైర్మన్ జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ మల్లేషంలు ప్రెస్ మీట్ నిర్వహించారు. దీంట్లో మాట్లాడుతూ హైదరాబాద్ సింగరేణి కాలనీ సంఘటన దుదృష్టకరం, బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారణమైన హంతకుణ్ణి పట్టుకుని, ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని అన్నారు. 

మల్లారెడ్డి టు మై హోం, మేఘా టు నవాయుగ వరకు రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ దందా ఎవరిని అడిగినా చెప్తారన్నారు. రేవంత్ హోల్ సేల్ బ్లాక్ మెయిల్ బ్రాండ్ అంబాసిడర్ అని, చీకటి పనులకు రేవంత్ నెంబర్ వన్ బ్రాండ్ అంబాసిడర్ అని మండిపడ్డారు. 

కేసీఆర్ తెలంగాణకు, అభివృద్ధికి... కేటీఆర్ ఐటికి, నవ యువ తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లు అని మర్చిపోవద్దన్నారు. డ్రగ్స్ కు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రం పంజాబ్ అనేది రేవంత్ రెడ్డి మర్చిపోవద్దని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ఉడ్తా పంజాబ్ సినిమా చూసి మాట్లాడాలన్నారు.

టీఆరెస్ డేటా తో మాట్లాడితే- రేవంత్ రెడ్డి నోటి తీట తో మాట్లాడుతారని ఎద్దేవా చేశారు. కాంగ్రేస్ పాలనలో హైదరాబాద్ అంతా రౌడీ షీటర్లతో నిండి ఉండేది. ఇపుడు సింగపూర్- బ్యాంకాక్ తరహాలో క్రైమ్ కంట్రోల్ టీఎస్ పోలీస్ చేస్తోంది. రేవంత్ రెడ్డి పోలీసులను సైతం బ్లాక్ మెయిల్ చేస్తుండు!. కరోనా సమయంలో కొడంగల్- మల్కాజిగిరి ఎప్పుడు పోయినవ్? రేవంత్ రెడ్డి ఎబివిపి-ఆర్ఎస్ఎస్ లో పుట్టి, టీఆరెస్ బాల్యం, పెరిగింది టీడీపీ అని.. రేవంత్ రెడ్డి చంద్రబాబు రాష్ట్రాన్ని వదిలేసి వెళ్లేలా చేశాడు..  రేవంత్ ఓ ఐరన్ లెగ్ అని దుమ్మెత్తి పోశారు. 

తెలంగాణలో టీడీపీకి పట్టిన గతే- కాంగ్రేస్ కి పట్టబోతోంది. కేసీఆర్ ను రేవంత్ రెడ్డి గాడ్ ఫాథర్ చంద్రబాబే ఎమ్ చేయలేకపోయాడు. లిల్లిపుట్ రేవంత్ తో ఎమ్ అయితదన్నారు. బీజేపీ- కాంగ్రేస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్సైజ్ ఆదాయాలు ఉన్నాయి- మరి అక్కడి సీఎంలు తాగుబోతులా? అని ప్రశ్నించారు. 

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లకు  నేను సవాల్ చేస్తున్నా!... ఏ వేదికగా నైనా చర్చకు నేను సిద్ధం. టీఆరెస్ పథకాలు బీజేపీ- కాంగ్రేస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇస్తున్నారా? చర్చిద్దాం అంటూ సవాల్ విసిరారు. 

సీఎం కేసీఆర్ మెడలువంచుతా... అప్పటివరకు నా పోరాటం ఆగదు: వైఎస్ షర్మిల

రాజస్థాన్ లో రేప్ కేసులు 2వందల శాతం పైగా పెరిగాయి. టెండర్లు వేసిన వాళ్ళ పై ఆర్టీఐ వేసి సీబీఐ కి ఇవ్వడం బ్లాక్ మెయిల్ కాదా? బండి సంజయ్ పాదయాత్ర అట్టర్ ఫెల్యూర్ అయింది. ఇతర జిల్లాల నుంచి ప్రజలను యాత్రకు తరలిస్తున్నారు.

2023లో బీజేపీ- గాంధీ భవన్ కు తాళాలు వేసుకోవాల్సిందే. బండి సంజయ్ కి దమ్ము ఉంటే కేంద్రం నుంచి 20వేల కోట్లు తెచ్చి రైతుల ధాన్యం కొనుగోలు చేయండి. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డిని కాదని కాంగ్రేస్ పార్టీ హైలెవల్ కమిటీ వేశారు. వార్తల కోసం సీఎం- కేటీఆర్- హరీష్  రావు లపై విమర్శలు చేయొద్దని హెచ్చరించారు.  

ఎమ్మెల్సీ మల్లేషం మాట్లాడుతూ..  సింగరేణి కాలనీ జరిగిన ఘటన దురదృష్టకరం. కలెక్టర్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి న్యాయం ప్రభుత్వం చేస్తోంది. ప్రతి విషయానికి సీఎం రావాల్సిన పనిలేదు. సీఎం ఆదేశాల మేరకు కలెక్టర్ బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేస్తోందన్నారు.

కేసీఆర్ స్థాయికి బండి సంజయ్- రేవంత్ రెడ్డి సరిపోరు. రేవంత్ రెడ్డి- బండి సంజయ్ ఒక్కటే స్కూల్ లో చదువుకున్నట్లు ఉన్నారు. కులవృత్తులకు కేసీఆర్ చేసిన న్యాయం ఎవ్వరూ చెయ్యలేదు. మరో ఇరవైఏళ్లు టీ ఆర్ ఎస్ అధికారం లో ఉంటుంది. హుజురాబాద్ లో గెల్లు గెలుపు ఖాయం. బీజేపీ తోనే టీ ఆర్ ఎస్ కు పోటీ. హుజురాబాద్ లో ఓటమి తర్వాత రేవంత్ పరిస్థితి ఏమిటి ? అని ఎద్దేవా చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios