రాచకొండ పోలీస్ కమీషనరేట్ (rachakonda police commissionerate) పరిధిలోని కీసర పోలీస్ స్టేషన్ (keesara police station) ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. యువకుడి మృతదేహంతో పీఎస్ ముందు బైఠాయించారు మృతుడి బంధువులు.
రాచకొండ పోలీస్ కమీషనరేట్ (rachakonda police commissionerate) పరిధిలోని కీసర పోలీస్ స్టేషన్ (keesara police station) ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. యువకుడి మృతదేహంతో పీఎస్ ముందు బైఠాయించారు మృతుడి బంధువులు. రెండ్రోజుల క్రితం బైక్పై వెళ్తుండగా మనోజ్ అనే యువకుడిని ఒక కారు ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం (road accident) జరిగి రెండు రోజులు గడుస్తున్నా.. నిందితులను పట్టుకోలేదంటూ బంధువులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
Add Asianetnews Telugu as a Preferred Source

