Asianet News TeluguAsianet News Telugu

నీ కథ సినిమా తీయాలంటే.. రాత్రుళ్లు చర్చించుకోవాలి, ‘వస్తావా’..

నీ కథ సినిమాగా తీయాలంటే నువ్వు నా కోరిక తీర్చాలి.. ఇది ఓ యువ రచయిత్రికి ఓ సినీ నిర్మాత ఇచ్చిన ఆఫర్. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. 

producer molestation female writer case filed in hyderabad
Author
Hyderabad, First Published May 20, 2022, 10:45 AM IST

హైదరాబాద్ : ‘నీ కథ బాగుంది… సినిమా తీసేందుకు అవసరమైనన్ని సన్నివేశాలున్నాయి.. కథను మరింతగా మెరుగు పరిచేందుకు మనం రాత్రుళ్లు చర్చించుకుందాం. ఫైవ్ స్టార్ హోటల్ కు వెల్తే అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అక్కడ నా కోర్కెలు తీర్చలేదనుకో.. సినీ పరిశ్రమలో అవకాశాలు దక్కకుండా చేస్తా’ అంటూ మహిలా కథా రచయితను బెదిరించిన సినీ నిర్మాతపై గోల్కొండ పోలీసులు కేసు నమోదు చేశారు. సినీ నిర్మాత వైఖరితో భయపడిన బాధితురాలు తొలుత  ‘షి’బృందానికి ఫిర్యాదు చేయగా.. ఆమెను భరోసా కేంద్రానికి పిలిపించారు. దీసీపీ శిరీష రాఘవేంద్ర స్వయంగా బాధిుతురాలితో మాట్లాడి గోల్కొండ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేయించారు. 

ఆరునెలల క్రితం.. ఆన్ లైన్ లో పరిచయం…
హైదరాబాద్ లో ఉంటున్న మహిళా కథారయిచత తన వద్ద ఉన్న కథను సినిమాగా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరునెలల క్రితం ఒక సినీ నిర్మాత ఆన్ లైన్ లో పరిచయం అయ్యాడు. విభిన్న నేపథ్యమున్న కథలు, సంఘటనలను తీస్తానని, ఖర్చు ఎంతైనా ఇబ్బంది లేదంటూ మహిళా రచయితకు చెప్పాడు. కథ, సన్నివేశాల చిత్తు ప్రతిని ఆమె నిర్మాతకు అందజేశారు. కథను చదువతానంటూ చెప్పిన నిర్మాత ఆమె ఫోన్ చేసినప్పుడల్లా తర్వాత మాట్లాడదాం అనేవాడు. కొద్దిరోజుల క్రితం అతడే ఆమెకు ఫోన్ చేశాడు.. కథ బాగుంది. రాత్రుళ్లు కలిస్తే ఇంకా బాగుంటుందని అన్నాడు. అప్పటినుంచి వరుసగా రాత్రుళ్లు ఫోన్లు చేసి లైంగిక కోర్కెలు తీర్చాలని.. లేదంటే నీకు ఒక్క సినిమాకు రాయకుండా అడ్డుుంటానంటూ బెదిరించాడు. బాధితురాలు భయంతో పోలీసులను ఆశ్రయించగా.. నిర్మాతను అదుపులోకి తీసుకుని గోల్కొండ పోలీసులకు అప్పగించారు.

నాలుగు నెలల్లో 423 ఫిర్యాదులు…

- బెదిరింపులు, ఈవ్ టీజింగ్ లతో తమను భయపెడుతున్నారు అంటూ నాలుగు నెలల్లో 423 మంది బాధితులు ‘షి’బృందాలను ఆశ్రయించారు. ఇందులో 203 నంది నేరుగా రాగా,  181 మంది 9490616555 నెంబర్ కు వాట్సాప్ చేశారు. మిగిలిన 39 మంది సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదు చేశారని డిసిపి శిరీష రాఘవేంద్ర తెలిపారు.

- ‘షి’బృందాలను బృందాలను ఆశ్రయించిన వారి ఫిర్యాదులను పరిశీలించిన పోలీసులు 57 కేసులను నమోదు చేయించారు. ఈవ్ టీజింగ్ కు పాల్పడుతున్న 52 మందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 15 మందిపై కేసులు నమోదు చేశారు. నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లోఈవ్ టీజింగ్ పాల్పడుతున్న 191 మంది పురుషులు, 23 మంది బాలురకు కౌన్సెలింగ్ నిర్వహించారు.

- చార్మినార్ ఠాణా పరిధిలో నివాసం ఉంటున్న ఒక యువతిని తీవ్రంగా వేధిస్తున్న సయ్యద్ అబ్దుల్ హసన్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా.. ఎనిమిది రోజుల జైలు శిక్ష, రూ. 250 జరిమానా విధిస్తూ  కోర్టు తీర్పునిచ్చింది.

- సంతోష్ నగర్ క్రాస్ రోడ్స్ సమీపంలోని ఓ కళాశాల వద్ద ఈవ్ టీజింగ్ చేస్తున్న మహమ్మద్ సొహైల్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా.. ఎనిమిది రోజుల జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

- ‘నిన్ను, నీ భర్తను చంపేస్తాను’ అంటూ నిత్యం ఫోన్లు, సందేశాలతో ఒక యువతి ని బెదిరిస్తున్న ఈ శ్రీనివాస్ ను షి బృందం పోలీసులు ఓయూ ఠాణాలో అప్పగించారు. 

- సంతోష్ నగర్ లో ఉంటున్న ఓ యువతిని బ్లాక్ మెయిల్ చేస్తున్న షేక్ మోతిషామ్ అహ్మద్ ను ‘షి’ బృందం పోలీసులు అదుపులోకి తీసుకుని సంతోష్ నగర్ పోలీసులకు అప్పగించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios