Asianet News TeluguAsianet News Telugu

ప్రచార జోరు పెంచిన కాంగ్రెస్.. నేడు తెలంగాణకు ప్రియాంక గాంధీ

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణ రాజకీయం వేడెక్కుతోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ జోరు పెంచింది.  నేటీ నుంచి రెండో విడత బస్సు యాత్ర ప్రచారం ప్రారంభించనున్నది.

Priyanka Gandhi will address a huge public meeting in Kollapur today KRJ
Author
First Published Oct 31, 2023, 10:48 AM IST

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఓ వైపు రాజకీయ నాయకుల వలసలు పెరుగుతుండటంతో పాటు..  ఇతర పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నేతలను తమ పార్టీలోకి తిప్పుకునేందుకు నియోజకవర్గ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ప్రత్యర్థుల బలబలాలను తెలుసుకుంటూ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ జోరు పెంచింది. ఈ తరుణం ఆ పార్టీ నిర్వహిస్తున్న విజయభేరి రెండో విడత బస్సు యాత్ర ప్రచారం ప్రారంభం కానున్నది. 
 
ఈ ప్రచార భాగంగా ఆ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ (Priyanka Gandhi)మరోసారి తెలంగాణకు రానున్నది.. ఈ రోజు మంగళవారం మధ్యాహ్నం తొలుత దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం కొల్హాపూర్ లో నిర్వహించే పాలమూరు ప్రజా గర్జన బహిరంగ సభలో పాల్గొని  ప్రియాంక గాంధీ ప్రసంగిస్తారు. కాగా ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం దేవరకద్ర మీటింగ్ రద్దయింది.

Follow Us:
Download App:
  • android
  • ios