లంగాణలో జరిగే శాసనసభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుదే హవా అని ఓ ప్రీపోల్ సర్వే తెలియజేసింది. మళ్లీ కేసిఆర్ ముఖ్యమంత్రి కావాలని తెలంగాణలోని అత్యధికులు కోరుకుంటున్నట్లు ఆ సర్వే బయటపెట్టింది.
హైదరాబాద్: తెలంగాణలో జరిగే శాసనసభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుదే హవా అని ఓ ప్రీపోల్ సర్వే తెలియజేసింది. మళ్లీ కేసిఆర్ ముఖ్యమంత్రి కావాలని తెలంగాణలోని అత్యధికులు కోరుకుంటున్నట్లు ఆ సర్వే బయటపెట్టింది. ఆజ్తక్- ఇండియాటుడే మీడియా గ్రూపు, వీడీపీ అసోసియేట్స్లు వేర్వేరుగా నిర్వహించిన సర్వేలు ఈ విషయాన్ని బయటపెట్టాయి.
గత నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టిస్తుందని ఆ సర్వేలు తెలిపాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేసీఆర్కు మద్దతుగా 43శాతం ఓటర్లు నిలుస్తారని ఆజ్తక్-ఇండియాటుడే సర్వే తేల్చింది.
వీడీపీ అసోసియేట్స్ నిర్వహించిన సర్వేలో 51 శాతం ఓటర్లు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నారని తేలింది. రాష్ట్రంలో టీఆర్ఎస్కు 80 సీట్లు లభిస్తాయని వీడీపీ అసోసియేట్స్ సర్వే తెలిపింది.
ఓటింగ్ శాతాలపరంగా చూసినా, సీట్లపరంగా చూసినా, ముఖ్యమంత్రి అభ్యర్థి రీత్యా చూసినా టీఆర్ఎస్కు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు దరిదాపుల్లో ఎవరూ లేరని సర్వే ఫలితాలను బట్టి తెలుస్తోంది.
ప్రజాదరణ విషయంలో కేసీఆర్కు 43 శాతం మద్దతు పలుకగా, పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డికి 18 శాతం,, బీజేపీ నేత కిషన్రెడ్డికి 15 శాతం, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి 4 శాతం మద్దతు ఉందని ఆజ్తక్ సర్వేలో తేలింది..
త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు చెందిన నేతలతో పోలిస్తే కేసీఆర్కు అత్యధిక ప్రజాదరణ లభించింది. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరుపై 64 శాతం ప్రజలు తమ సంతృప్తిని వ్యక్తంచేశారని ఆజ్తక్ సర్వే తెలిపింది.
తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపక్షాలకు అందనంత ఎత్తున కేసీఆర్ ఉన్నారని ఆజ్తక్- ఇండియాటుడే- యాక్సిస్ మై ఇండియా గ్రూపు ఎండీ ప్రదీప్గుప్తా చెప్పారు.
ఈ వార్తాకథనం చదవండి
ప్రీ పోల్ సర్వే: ఏ పార్టీకి ఎన్ని సీట్లు, రేవంత్ రెడ్డి బలమెంత?
