ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఆదివారం సీఎం కేసీఆర్ ను కలిశారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వచ్చిన ప్రశాంత్ కిశోర్ (prashant kishor) ఆయనతో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ థాకరే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ లతో చర్చల సారాంశాన్ని సీఎం కేసీఆర్... ప్రశాంత్ కిశోర్ కు వివరించినట్టు తెలిసింది
ఇప్పటికే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తోన్న టీఆర్ఎస్ (trs) అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) అందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే (uddhav thackeray) , ఎన్సీపీ అధినేత శరద్ పవార్లను (sharad pawar) ఆయన కలిశారు. దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఆదివారం సీఎం కేసీఆర్ ను కలిశారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వచ్చిన ప్రశాంత్ కిశోర్ (prashant kishor) ఆయనతో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ థాకరే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ లతో చర్చల సారాంశాన్ని సీఎం కేసీఆర్... ప్రశాంత్ కిశోర్ కు వివరించినట్టు తెలిసింది. ఆదివారం నాడు ప్రకాష్ రాజ్ (prakash raj), ప్రశాంత్ కిషోర్ లు Mallanna Sagar రిజర్వాయర్ ను పరిశీలించి, నిర్వాసితులతో మాట్లాడారు.
ఈ నెల 23వ తేదీనే తెలంగాణ సీఎం కేసీఆర్ మల్లన్నసాగర్ రిజర్వాయర్ ను జాతికి అంకితం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత ఎక్కువ నీటి సామర్ధ్యం ఉన్న రిజర్వాయర్లలో మల్లన్నసాగర్ రిజర్వాయరే అతి పెద్దది. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం తుదిదశకు చేరుకొంది. ముఖ్యంగా మల్లన్నసాగర్ తెలంగాణకు గుండెకాయ. kaleshwaram ప్రాజెక్టులోనే అత్యధిక నీటి నిల్వ సామర్థ్యమున్న, అత్యంత ఎత్తున ఉన్న జలాశయం మల్లన్నసాగర్. సిద్దిపేట జిల్లాలో 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ జలాశయానికి 5 ఓటీ స్లూయిస్ లను ఏర్పాటు చేశారు. ఆ తూముల ద్వారానే కొండపోచమ్మ, గంధమల్ల రిజర్వాయర్కు, సింగూరు ప్రాజెక్టుకు, తపాస్పల్లి రిజర్వాయర్ కు, మిషన్ భగీరథకు నీటిని తరలిస్తారు.మల్లన్నసాగర్ ఉత్తర, దక్షిణ తెలంగాణ ప్రాంతాలకు ఓ వరప్రదాయిని. అందుకే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం DPRలో మల్లన్నసాగర్ను మదర్ రిజర్వాయర్ గా పేర్కొన్నారు.
మల్లన్నసాగర్ రిజర్వాయర్ FRL 535 మీటర్లు. దీంతో మెదక్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాలకు కేవలం గ్రావిటీ ద్వారా జలాల్ని తరలించే వెసులుబాటు లభించింది. మల్లన్నసాగర్ కింద 1.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ప్యాకేజీ-13 కింద మల్లన్నసాగర్ నుంచి 8.733 కిలోమీటర్ల మేర నిర్మించే గ్రావిటీ కాల్వ ద్వారా 53వేల ఎకరాలు సాగు కానున్నది. ప్యాకేజీ-17, 18, 19 కింద 11.670 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వ తో11.525 కిలోమీటర్ల టన్నెల్ ఆపై మరో 2.505 గ్రావిటీ కాల్వ ద్వారా గోదావరి జలాల్ని హల్దీ నదిని దాటిస్తారు. అవసరమైతే అక్కడ నేరుగా హల్దీ నదిలోకి కూడా గోదావరిజలాల్ని పోసే వెసులుబాటు ఉంటుంది.
ఆపై 34 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వ, 3.65 కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణంతో జలాలు మంజీరా నదిని దాటుతాయి. అక్కడి నుంచి 37.900 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వ ద్వారా సింగూరు రిజర్వాయర్ సమీపంలోని ముదిమానిక్ తండా వద్ద నిర్మించే పంపుహౌజ్ వరకు తరలిస్తారు. ప్యాకేజీ-18 కింద 15వేల ఎకరాలు, ప్యాకేజీ-19 కింద 1.17 లక్షల ఎకరాలకు సాగునీరు అందనునుంది. మల్లన్నసాగర్ నుంచి 8.175 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వ ద్వారా 530 కాంటూర్ వద్ద నిర్మించే ఆనకట్ట దగ్గరకు గోదావరి జలాల్ని తరలిస్తారు. అక్కడ నుంచి నల్లగొండ జిల్లాలో నిర్మించే గంధంమల్ల రిజర్వాయర్ కు గోదావరి జలాల్ని తరలిస్తారు. ఈ క్రమంలో ప్యాకేజీ-15 కింద 55వేల ఎకరాలకు సాగునీరు అందనుంది.
అదే మార్గంలో జలాల్ని ప్యాకేజీ-16 ద్వారా 11.39 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే బస్వాపూర్ రిజర్వాయర్ కు నీటిని అందిస్తారు. తద్వారా ఈ ప్యాకేజీ కింద 1.88 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. దీనితో పాటు ఆనకట్ట నుంచి ప్యాకేజీ-14 కింద 4.850 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వ ద్వారా 8.950 కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణం ద్వారా జలాల్ని కొండపోచమ్మ రిజర్వాయర్ సమీపంలో మెదక్ జిల్లా వర్గల్ మండలం పాములపర్తి వద్ద నిర్మించే పంపుహౌజ్ వరకు తరలిస్తారు. ప్యాకేజీ-14 ద్వారా గ్రావిటీపైనే 2.27 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. పాములపర్తి దగ్గర కేవలం 89 మీటర్ల మేర మాత్రమే లిఫ్టు ఉంది. ఇలా మొత్తంగా దాదాపు ఎనిమిది లక్షల ఎకరాలకు గ్రావిటీపై సాగునీరు అందించవచ్చు.
