చేతకాని ప్రతిపక్షాలు టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభ ను చూసి ఏడుస్తున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ ఎస్ ప్రగతినివేదన సభకు రాణిగంజ్ నుంచి బుల్లెట్ ర్యాలీని తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. దేశ రాజకీయాల్లో టీఆర్ ఎస్ ప్రగతి నివేదన సభ ఒక చరిత్ర సృష్టిస్తోందన్నారు.
హైదరాబాద్: చేతకాని ప్రతిపక్షాలు టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభ ను చూసి ఏడుస్తున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ ఎస్ ప్రగతినివేదన సభకు రాణిగంజ్ నుంచి బుల్లెట్ ర్యాలీని తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. దేశ రాజకీయాల్లో టీఆర్ ఎస్ ప్రగతి నివేదన సభ ఒక చరిత్ర సృష్టిస్తోందన్నారు.
Add Asianetnews Telugu as a Preferred Source

ఏ జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఈ తరహాలో సభలు నిర్వహించలేదన్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు ప్రభుత్వ పథకాలు చాటేందుకు సభ నిర్వహిస్తున్నామన్నారు. ఎన్నికల శంఖారావంగానే ప్రగతి నివేదన సభ నిర్వహణ ఉంటుందన్నారు. దమ్ముంటే ఇతర రాజకీయ పార్టీలు మీటింగ్ లు పెట్టుకోవచ్చన్నారు.
