రాజాసింగ్ ఏమైనా జ్యోతిష్కుడా?.. పొన్నం ప్రభాకర్
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
![ponnam prabhakar fires on bjp mla raja singh - bsb ponnam prabhakar fires on bjp mla raja singh - bsb](https://static-ai.asianetnews.com/images/01frqcpwhyyqwjyhb0mx9pa69q/ponnam-prabhakar-jpeg_363x203xt.jpg)
హైదరాబాద్ : ప్రభుత్వం కూలిపోతుందని ఒకడు.. పదిమంది ఎమ్మెల్యేలు పోతారని ఇంకొకడు కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్యప్రచారాలు చేస్తున్నారు. రాజాసింగ్ ఏమైనా జ్యోతిష్యం చదివాడా అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. పదిమంది ఎమ్మెల్యేలు పోతారని ఎలా అంటున్నారు.. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూస్తున్నారు అంటూ పొన్నం ప్రభాకర్ విమర్శించారు.
బీఆర్ఎస్, బిజెపి, ఎంఐఎం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరచాలని కుట్రలు చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాని బిజెపి నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చెబుతున్నారని విరుచుకుపడ్డారు.