సీఎం కేసీఆర్ సహా పలువురు మంత్రులు ఐఎఎస్,ఐపీఎస్ అధికారులకు లిక్విడ్ బాటిల్స్ పార్శిల్ ప ై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎఫ్ఎస్ఎల్ ప్రాథమిక రిపోర్టు చూసి పోలీసులు షాక్ తిన్నారు.
హైదరాబాద్: సీఎం కేసీఆర్ సహా మంత్రులు, వీఐపీలకు బాటిల్స్ లో మురుగు నీరు ఉందని ప్రాథమికంగా తేల్చారు. ఈ విషయమై ఇంకా పూర్తిస్థాయి నివేదిక కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు.
ఈ నెల 17వ తేదీన సీఎం కేసీఆర్ సహా మంత్రులు, ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు, వీఐపీలకు 62 కాటన్ బాక్స్ లను ఓ అజ్ఞాత వ్యక్తి బుక్ చేశాడు. ఈ కాటన్ లలో ఉన్న బాటిల్స్ లో లిక్విడ్ ఉన్నట్టుగా గుర్తించారు.. అంతేకాదు ఈ బాటిల్స్ నుండి దుర్వాసన వస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన సికింద్రాబాద్ పోస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఈ సమాచారం మేరకు పోలీసులు మంగళవారం సాయంత్రం ఈ బాటిల్స్ నుండి నమూనాలను సేకరించి ల్యాబ్ కు తరలించారు. ఈ బాటిల్స్ ఉన్న లిక్విడ్ ఏమిటనే విషయమై తేల్చేందుకు సిద్దమయ్యారు.
అయితే ఈ బాటిల్స్ లో ఉన్న లిక్విడ్ మురుగు నీరు అంటూ ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రాథమికంగా తేల్చింది. ఇంకా పూర్తిస్థాయి నివేదిక రావాల్సి ఉంది. ఓయూ లో మురుగరు నీరునే తాము తాగుతున్నామని వారు ఈ బాటిల్స్ నిండా నింపి పంపారు.
ఈ బాటిల్స్ తో పాటు ఓ లేఖను కూడ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. మురుగు నీరే తాము తాగుతున్నామని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ విషయమై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ఈ లేఖ ఎవరు రాశారు....ఈ బాటిల్స్ ఎవరు పంపారనే విషయమై పోలీసులు కూడ విచారణ చేస్తున్నారు.
సంబంధిత వార్తలు
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Aug 21, 2019, 11:41 AM IST