Asianet News TeluguAsianet News Telugu

బాటిల్స్ కలకలం: సీఎం కేసీఆర్ సహా పలువురికి పార్శిల్స్

సికింద్రాబాద్ పోస్టాపీసు కార్యాలయానికి వచ్చిన పార్శిళ్లు కలకలం రేపాయి. మంగళవారం నాడు ఈ బాలిల్స్ పై పోలీసులు రహస్యంగా విచారణ జరుపుతున్నారు. 

police seize 50 bottles from abids post office in hyderabad
Author
Hyderabad, First Published Aug 20, 2019, 6:29 PM IST

హైదరాబాద్:సికింద్రాబాద్ పోస్టాపీసుకు వచ్చిన  పార్శిల్ కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి , మంత్రులు, ఐఎఎస్, ఐపీఎస్ అధికారుల పేర్లతో  ఈ బాటిల్స్ వచ్చాయి.

విఐపీలకు బాటిల్స్  పార్శిల్ రావడంపై పోస్టల్ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.  ఈ బాటిల్స్‌లో ఏముందనే విషయమై తేల్చేందుకు ల్యాబ్ కు పంపారు.ఇంత పెద్ద ఎత్తున ఒకే సారి వీఐపీలకు పార్శిల్ రావడంపై పోలీసులు కూడ విచారణ చేస్తున్నారు.ఈ బాటిల్స్ ఎక్కడ నుండి వచ్చాయనే కోణంలో కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు. 

ఈ బాటిల్స్ లో ఏమున్నాయనే విషయమై నిగ్గు తేల్చేందుకు ల్యాబ్ రిపోర్టు కోసం ఎదురు చేస్తున్నారు. ఆకతాయిలు చేసిన పనా.. లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios