నకిరేకల్ మండలంలోని ఓ గ్రామంలో మంగళవారం రాత్రి ఓ మహిళ ఇంట్లో కూర్చొని ఒంటరిగా టీవీ చూస్తోంది. ఇదే అదనుగా భావించిన అదే గ్రామానికి చెందిన పి.బాలకృష్ణనాయక్ ఇంట్లోకి ప్రవేశించాడు. బలవంతంగా ఆ మహిళను గదిలోకి ఎత్తుకెళ్లి... ఆమె అరవకుండా నోట్లో దుస్తులు కుక్కాడు.
దేశంలో మహిళలకు ఎక్కడా రక్షణ దొరకడం లేదు. దిశ హత్యోదంతం.. దేశం మొత్తాన్ని కలచివేసింది. దుర్మార్గులను చంపేయండి అంటూ దేశం మొత్తం గళం ఎత్తి వినిపిస్తోంది. మరోవైపు మాత్రం మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. తాజాగా.. నల్గొండ ఓ మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారు.
Add Asianetnews Telugu as a Preferred Source

నకిరేకల్ మండలంలోని ఓ గ్రామంలో మంగళవారం రాత్రి ఓ మహిళ ఇంట్లో కూర్చొని ఒంటరిగా టీవీ చూస్తోంది. ఇదే అదనుగా భావించిన అదే గ్రామానికి చెందిన పి.బాలకృష్ణనాయక్ ఇంట్లోకి ప్రవేశించాడు. బలవంతంగా ఆ మహిళను గదిలోకి ఎత్తుకెళ్లి... ఆమె అరవకుండా నోట్లో దుస్తులు కుక్కాడు.
ఆపై ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. రాత్రి ఇంటికి వచ్చిన భర్తకు బాధితురాలు విషయం తెలియజేసింది. ఆమెను బుధవారం వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరుకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
