ప్రధాని నరేంద్ర మోదీ పెద్దపల్లి జిల్లాలోని రామగుండం చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్టు నుంచి హెలికాఫ్టర్లో ఆయన రామగుండం చేరుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ పెద్దపల్లి జిల్లాలోని రామగుండం చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్టు నుంచి హెలికాఫ్టర్లో ఆయన రామగుండం చేరుకున్నారు. రామగుండంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద ల్యండ్ అయిన ప్రధాని మోదీ.. రోడ్డు మార్గంలో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. అరగంట పాటు ప్రధాని మోదీ రామగుండం ఎరువుల ఫ్యాకర్టీని సందర్శించారు.అక్కడ ఎరువుల ఉత్పత్తిని పరిశీలించారు. మోదీ వెంట గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, భగవంత్ ఖుబా, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్లు ఉన్నారు. అనంతరం రామగుండం ఎరువుల ఫ్యాకర్టీ ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. తర్వాత ఎన్టీపీసీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు.
బహిరంగ సభ ముగిసిన అనంతరం సాయంత్రం 5:30 గంటలకు హైదరాబాద్కు తిరుగు ప్రయాణమవుతారు. సాయంత్రం 6.40 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.
రామగుండం పర్యటలో భాగంగా ప్రధాన మంత్రి ప్రధాన మంత్రి రూ. 9,500 కోట్ల విలువైన పథకాలకు శంకుస్థాపనలు, జాతికి అంకితం చేయనున్నారు. రామగుండంలో ఎరువుల ప్లాంట్ను జాతికి అంకితం చేయనున్నారు. దాదాపు రూ. 1000 కోట్ల వ్యయంతో నిర్మించిన భద్రాచలం రోడ్డు-సత్తుపల్లి రైలు మార్గాన్ని ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. అలాగే 2200 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ రహదారుల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో ఎన్హెచ్-765డీజీ మెదక్-సిద్దిపేట-ఎల్కతుర్తి సెక్షన్, ఎన్హెచ్-161బీబీ బోధన్-బాసర్-భైంసా విభాగం, ఎన్హెచ్-353సీ యొక్క సిరోంచ నుండి మహదేవ్పూర్ సెక్షన్లు ఉన్నాయి.
