మన్ కీ బాత్.. తెలంగాణ సంస్కృతి, ప్రతిభపై పలుమార్లు మోదీ ప్రశంసలు.. వివరాలు ఇవే..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా తన మనసులోని మాటను దేశ ప్రజలతో పంచుకుంటున్నారు. అయితే తన మన్ కీ బాత్ ఎపిసోడ్లలో పలు సందర్భాల్లో తెలంగాణపై ప్రశంసలు కురిపించారు.
![PM Modi has continuously celebrated Telangana tradition and talent in Mann Ki Baat ksm PM Modi has continuously celebrated Telangana tradition and talent in Mann Ki Baat ksm](https://static-ai.asianetnews.com/images/01gjvyx2w9v7m5p9wnqshahxpj/pm-modi--2--jpg_363x203xt.jpg)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా తన మనసులోని మాటను దేశ ప్రజలతో పంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రతి నెలా చివరి ఆదివారం ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తున్నారు. మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 30వ తేదీతో 100వ ఎపిసోడ్ పూర్తి కానుంది. మన్ కీ బాత్లో ప్రధాని మోదీ తన మనసులోని మాటలనే కాకుండా.. తరుచుగా భారతదేశం అంతటా స్ఫూర్తిదాయకమైన కథనాలను పంచుకుంటుంటారు. ప్రధాని మోదీ తన మన్ కీ బాత్ ఎపిసోడ్లలో పలు సందర్భాల్లో తెలంగాణపై ప్రశంసలు కురిపించారు.
తెలంగాణలోని విశిష్ట సంస్కృతి, సంప్రదాయాలు, విశేషమైన విజయాలను నొక్కిచెబుతూ ఈ ప్రాంతంతో ప్రత్యేక అనుబంధాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. పూర్ణా మాలావత్ అసాధారణ పర్వతారోహణ పరాక్రమాన్ని ప్రశంసించడం నుంచి చింతల వెంకట్ రెడ్డి గ్రౌండ్ బ్రేకింగ్ విటమిన్ డి-రిచ్ రైస్ను ప్రశంసించడం వరకు భారతదేశానికి తెలంగాణ చేసిన అనేక సహకారాన్ని ప్రధాని మోదీ గుర్తుచేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నైపుణ్యం కలిగిన చేనేత కార్మికుడు హరిప్రసాద్ నుంచి చేతితో తయారు చేసిన జీ20 చిహ్నాన్ని అందుకోవడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా తెలంగాణలో జరుపుకునే గిరిజన సంస్కృతి, పండుగలను కూడా ప్రధాన మంత్రి గుర్తించారు. ఉదాహరణకు రాష్ట్ర గిరిజన సంస్కృతికి సంబంధించిన హృద్యమైన కథలను పంచుకున్నారు. ఇద్దరు గిరిజన వీర మహిళలు సమ్మక్క, సారలమ్మను గుర్తుగా జరుపుకునే మేడారం జాతర పండుగను ఆయన ప్రస్తావించారు.
డ్రోన్ ఆధారిత వ్యాక్సిన్ల డెలివరీ కోసం మార్గదర్శక ట్రయల్స్ ద్వారా ప్రదర్శించబడిన తెలంగాణ ఆవిష్కరణల డ్రైవ్ను కూడా ప్రధాని మోదీ నొక్కిచెప్పారు.
మనోహరమైన కథలు, పరస్పర చర్యలను పంచుకోవడం ద్వారా ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలలో గర్వాన్ని నింపారు. అలాగే వారి కథలతో దేశాన్ని కదిలించారు.
మన్ కీ బాత్లో తెలంగాణ గురించి ప్రస్తావించిన కొన్ని అంశాలు..
>> చింతల వెంకట్ రెడ్డి విటమిన్ డి లో సమృద్ధిగా ఉన్న బియ్యాన్ని అభివృద్ధి చేశారు. ఆ లోపాన్ని ప్రజలు స్వయంగా నయం చేసుకోవడానికి వీలు కల్పించారు. ఇందుకుగానూ ఆయనను పద్మశ్రీతో సత్కరించారు.
>> తెలంగాణకు చెందిన పి అరవింద్ రావు చంద్రయాన్ మిషన్పై మాట్లాడాలని ప్రధానిని కోరారు.
>> హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో కోవిడ్ నుంచి విజయవంతంగా కోలుకోవడంపై తన అనుభవాన్ని వివరించమని రామ్గంప తేజను ప్రధాని మోదీ కోరారు.
>> ఏడు పర్వతాల శిఖరాలను అధిరోహించిన పూర్ణ మాలావత్ను ప్రధాని మోదీ అభినందించారు.
>> ఈ-వ్యర్థాలపై మాట్లాడాలని విజయ్ ప్రధానిని కోరారు. దీనికి ప్రతిస్పందనగా ప్రధానమంత్రి ఈ-వేస్ట్ అంటే కచ్రే సే కంచన్ గురించి మాట్లాడారు.
>> హరిప్రసాద్ తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నేత కార్మికుడు. ఆయన చేతితో నేసిన జీ 20 G20 చిహ్నాన్ని ప్రధానమంత్రికి బహుమతిగా ఇచ్చారు.
>> భారతదేశం ఆఫ్రికా నుంచి చిరుతలను తరలించడం పట్ల ఎన్ రామచంద్రన్ రఘురాం తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
>> వచ్చే ఏడాది తెలంగాణలోని తుంగభద్ర నది ఒడ్డున పుష్కరాలు జరగనున్నాయి.
>> తెలంగాణలోని వరంగల్ జిల్లాలోని మాంగ్త్యా-వాల్య తండా పంచాయతీ అమృత్ సరోవర్లను నిర్మించింది.
>> తెలంగాణలో ఇద్దరు గిరిజన వీర మహిళలు సమ్మక్క, సారలమ్మలను పూజిస్తూ జరుపుకునే మేడారం జాతర ఉత్సవాలను ప్రధాని ప్రస్తావించారు.
>> తెలంగాణ డ్రగ్స్, మెడిసిన్ డ్రోన్ డెలివరీ కోసం ట్రయల్స్ సెట్ చేసింది.