Peddapalli: పెద్దపల్లి తహశీల్దార్, ఆర్ఐతో 9 మందిపై కేసు.. బాధితుడు కోర్టును ఆశ్రయించడంతో..
పెద్దపల్లి (peddapalli) జిల్లాలో తహశీల్దార్, ఆర్ఐతో పాటు 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు వారిపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు.
పెద్దపల్లి (peddapalli) జిల్లాలో తహశీల్దార్, ఆర్ఐతో పాటు 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు వారిపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు. పెద్దపల్లిలోని సర్వే నెంబర్. 557/2 లో కోర్టు పరిధిలో ఉన్న భూమి (Land) వేరే వారికి పాస్బుక్ జరీచేయడంతో బాధితుడు రవీందర్ రావు కోర్టును ఆశ్రయించాడు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు పెద్దపల్లి తహశీల్దార్, ఆర్ఐతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.