నిజామాబాద్ లో ఏర్పాటుకు నిర్ణయం

ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతంజలి ఆయుర్వేద సంస్థ తెలంగాణ లో కొత్తగా పరిశ్రమను నెలకొల్పేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగానే టెక్స్ టైల్ పార్కు తదితర పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమ ఏర్పాటుకూ చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆ సంస్థ సీఈఓ బాలకృష్ణ మంగళవారం జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడుతూ జిల్లాలో స్థలాలు పరిశీలించి పసుపు ఆధారిత పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పారు. పతంజలి సీఈఓ బాలకృష్ణ మాట్లాడుతూ ఈ విషయంపై తమ సంస్థ దృష్టిపెట్టి రైతులకు లబ్ధి చేకూర్చేందుకు కృషి చేస్తుందన్నారు.