Asianet News TeluguAsianet News Telugu

దుబ్బాక బైపోల్, ట్విస్టిచ్చిన సీఈఓ శశాంక్ గోయల్: ఆ నాలుగు ఈవీఎంలు లెక్కించలేదు

దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఇంకా నాలుగు ఈవీఎంలలోని ఓట్లను లెక్కించాల్సి ఉందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈఓ) శశాంక్ గోయల్ చెప్పారు.
 

not counted  evms from 81, 188 polling stations   says CEO shashank goel lns
Author
Dubbaka, First Published Nov 10, 2020, 5:12 PM IST


సిద్దిపేట: దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఇంకా నాలుగు ఈవీఎంలలోని ఓట్లను లెక్కించాల్సి ఉందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈఓ) శశాంక్ గోయల్ చెప్పారు.

also read:దుబ్బాక: కేసీఆర్ కు షాక్, టీఆర్ఎస్ మీద బిజెపి తొలిదెబ్బ

మంగళవారం నాడు సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. దుబ్బాక అసెంబ్లీ పరిధిలోని 21, 188 పోలింగ్ కేంద్రాల్లో ఇంకా రిజల్ట్ రాలేదని ఆయన చెప్పారు.

ఈ రెండు పోలింగ్ కేంద్రాల్లోని  నాలుగు ఈవీఎంలలో 1669 ఓట్లున్నాయని ఆయన వివరించారు.సాంకేతిక సమస్యల కారణంగా ఈ ఓట్లను లెక్కించలేకపోవడానికి ఇబ్బందులు నెలకొన్నాయన్నారు.దీంతో ఈ నాలుగు ఈవీఎంలలోని వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించనున్నట్టుగా ఆయన తెలిపారు.

136, 157/ఎ పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ తర్వాత క్లియర్ చేయలేదన్నారు.  నిబంధనల ప్రకారంగా ఓట్ల లెక్కింపును చేపడుతామని ఆయన చెప్పారు. ప్రస్తుతం దుబ్బాకలో విజయం సాధించామని బీజేపీ సంబరాలు చేసుకొంటుంది. ఈ తరుణంలో మరోసారి వీవీప్యాట్ స్లిప్పులను లెెక్కిస్తున్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios