కొత్తయుగం నేరాలకు కొత్త పరిష్కారాలు అవసరం.. సైబర్ సెక్యూరిటీపై కేటీఆర్ వ్యాఖ్యలు
Hyderabad: కొత్త తరం నేరాలకు కొత్త తరం పరిష్కారాలు అవసరమని సైబర్ సెక్యూరిటీపై మంత్రి కేటీ.రామారావు (కేటీఆర్) అన్నారు. జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ హెల్ప్ లైన్ '1930'ను ప్రచారం చేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.
Cyber Security- KTR: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో శనివారం జరిగిన తెలంగాణ స్టేట్ పోలీస్ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఫర్ సైబర్ సేఫ్టీ ప్రారంభోత్సవంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) సైబర్ సెక్యూరిటీ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. సైబర్ క్రైమ్ రాజకీయాల్లోకి కూడా ప్రవేశించిందనీ, ఈ-వ్యాలెట్లు, ఆన్లైన్ లావాదేవీల ద్వారా డబ్బు పంపడం ద్వారా ఓటర్లను ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఓటు వేయమని ప్రలోభపెడుతున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
వివరాల్లోకెళ్తే.. సైబరాబాద్లో తెలంగాణ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఫర్ సైబర్ సేఫ్టీని మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ అలీ, ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కొత్త తరం నేరాలకు కొత్త తరం పరిష్కారాలు అవసరమని సైబర్ సెక్యూరిటీపై వ్యాఖ్యానించారు. జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ హెల్ప్ లైన్ '1930'ను ప్రచారం చేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.
సీసీటీవీ నెట్వర్క్ను ఏర్పాటు చేయడంలో పోలీసులు చేస్తున్న కృషిని ప్రశంసించిన కేటీఆర్, నేరాలు చేయాలనే ఆలోచనలో ఉన్నవారిని నిరోధించే బాడీ-వేర్న్ కెమెరాల వినియోగం, నల్సార్ (నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్) ఇప్పటికే డ్రాఫ్టింగ్పై కసరత్తు చేస్తోందని చెప్పారు. సైబర్ క్రైమ్పై చట్టం, ఇది బహుశా దేశంలోనే మొదటిది కావచ్చని ఆయన అన్నారు.
జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ హెల్ప్లైన్ '1930'ని ప్రచారం చేయాల్సిన అవసరాన్ని మంత్రి నొక్కిచెప్పారు. సామాజిక కార్యకర్త సునీత కృష్ణన్ సూచించిన విధంగా లైంగిక నేరస్థుల రిజిస్ట్రీని తీసుకురావాలని పోలీసు శాఖను అభ్యర్థించారు. అవగాహన లోపం వల్లే సైబర్ నేరాలు జరుగుతున్నాయని చెప్పిన మంత్రి కేటీఆర్.. మోసపోతున్న వారిలో చదువుకున్న వారు, ఐటీ ఉద్యోగులు కూడా ఉండటం బాధాకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ సైబర్ క్రైమ్ను ఎదుర్కొనేందుకు పోలీసులు, ఐటీ సంస్థలు, విద్యాసంస్థలు, బ్యాంకుల సమన్వయంతో సైబర్ క్రైమ్ కేంద్రం పనిచేస్తుందని చెప్పారు.
డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఎం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ క్రైమ్ బారిన పడని వారు లేదా బాధితులు ఎవరూ లేరనీ, దేశంలోనే ఈ టెక్నాలజీని ఉపయోగించిన మొదటి పోలీసు సంస్థ తమదేనని అన్నారు. కాగా, మైక్రోసాఫ్ట్, ఐఐటీ హైదరాబాద్, సియంట్ సంస్థల సహకారంతో రాష్ట్ర పోలీసులు ఏర్పాటు చేసిన తెలంగాణ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఫర్ సైబర్ సేఫ్టీ సెంటర్ దేశంలోనే మొదటిది కావడం విశేషం.