Asianet News TeluguAsianet News Telugu

హజీపూర్ సీరియల్ రేపిస్ట్, కిల్లర్ శ్రీనివాస్ రెడ్డికి ఉరి శిక్ష

హాజీపూర్ కేసులో దోషిగా నిర్ధారించిన మర్రి శ్రీనివాస్ రెడ్డికి నల్గొండ కోర్టు ఉరి శిక్షను విధించింది. 

Nalgonda special court orders to hang convict srinivas reddy in hajipur case
Author
Hyderabad, First Published Feb 6, 2020, 6:30 PM IST

నల్గొండ: హజీపూర్ సీరియల్ రేప్, హత్య కేసులో నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డికి  నల్గొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టు గురువారం నాడు ఉరి శిక్ష విధించింది. కల్పన కేసులో జీవిత ఖైదు విధించారు.  శ్రావణి , మనీషా కేసుల్లో నిందితుడికి మరణశిక్షను విధించారు.శ్రావణి కేసులో స్ట్రాంగ్ సాక్ష్యాధారాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. 

Also read:నాకేం తెలియదు: కోర్టులో ఏడ్చేసిన హజీపూర్ సీరియల్ రేపిస్ట్ శ్రీనివాస రెడ్డి

గురువారం నాడు మధ్యాహ్నం ఫోక్సో కోర్టు జడ్జి ముందు రాచకొండ పోలీసులు హాజరుపర్చారు.ఈ కేసు గురించి జడ్జి నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని ప్రశ్నించారు. అయితే ఈ కేసులతో తనకు సంబంధం లేదని నిందితుడు శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.తన ఇల్లును కూడ గ్రామస్తులు కూల్చి వేశారని శ్రీనివాస్ రెడ్డి జడ్జికి వివరించారు.  

 మీ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నాని జడ్జి మర్రి శ్రీనివాస్ రెడ్డిని ప్రశ్నించారు. అయితే  తన తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో తనకు తెలియదని మర్రి శ్రీనివాస్ రెడ్డి జడ్జి దృష్టికి తెచ్చారు.

తన తల్లిదండ్రులను  తానే చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని మర్రి శ్రీనివాస్ రెడ్డి  జడ్జికి చెప్పారు.శిక్ష గురించి ఏమైనా చెప్పుకొంటావా అని జడ్జి ప్రశ్నించాడు. అయితే ఈ విషయం తనకు తెలియదని శ్రీనివాస్ రెడ్డి వివరించారు.   

90 రోజుల్లో ఈ కేసు విచారణను పోలీసులు పూర్తి చేశారు. 101 మంది సాక్షులను కోర్టు విచారించింది. సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి ని ఉరి తీయాలని హాజీపూర్ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రాసిక్యూషన్ కూడ నిందితుడికి ఉరి శిక్ష విధఇంచాలని డిమాండ్ చేసింది.

2019 ఏప్రిల్ 24వ తేదీన శ్రావణి హత్య కేసుతో మర్రి శ్రీనివాస్ రెడ్డి దారుణాలు వెలుగు చూశాయి.  నాలుగేళ్ల క్రితం అదృశ్యమైన ఆరో తరగతి విద్యార్థిని కల్పనను కూడ మర్రి శ్రీనివాస్ రెడ్డి హత్య చేసినట్టుగా ఒప్పుకొన్నట్టుగా పోలీసులు ప్రకటించారు.

2019 జూన్‌లో మనీషా, శ్రావణిలు అదృశ్యమయ్యారు. శ్రీనివాస్ రెడ్డిపై 2019 జూలై 31న తొలికేసు నమోదైంది. మూడు కేసులకు సంబంధించి పోలీసులు వేర్వేరుగా ఛార్జీషీట్ దాఖలు చేశారు.  ఈ ఏడాది అక్టోబర్ 14వ తేదీన ఫోక్సో కోర్టు ఈ కేసు విచారణను ప్రారంభించింది. 

ఈ కేసులో గత ఏడాది డిసెంబర్ 19వ తేదీవరకు  వాదనను విన్పించింది ప్రాసిక్యూషన్. అదే ఏడాది డిసెంబర్ 26న నిందితుడికి సాక్ష్యాలను న్యాయస్థానం విన్పించంది. ఈ ఏడాది జనవరి 3వ తేదీన నిందితుడి వాదనను కూడ కోర్టు తెలుసుకొంది.అయితే ముగ్గురు  బాలికలు ఎవరో తనకు తెలియదని నిందితుడు కోర్టుకు వివరించారు. నిందితుడికి సంబంధించిన ఆధారాలను పోలీసులు కోర్టుకు సమార్పించారు. 

అయితే శ్రావణిని హత్య  చేసినట్టుగా తొలిసారిగా శ్రీనివాస్ రెడ్డి ఒప్పుకొన్నారు. ఆ తర్వాత అదే బావిలో మనీషా మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు శ్రీనివాస్ రెడ్డిని విచారిస్తే మనీషాను చంపినట్టుగా ఒప్పుకొన్నారు.

మరో వైపు నాలుగేళ్ల క్రితం కల్పనను హత్య చేసినట్టుగా కూడ శ్రీనివాస్ రెడ్డి ఒప్పుకొన్నారని పోలీసులు ప్రకటించారు. హాజీపూర్‌లో  ముగ్గురు  విద్యార్ధినులను హత్య చేసిన  శ్రీనివాస్ రెడ్డి ఒంటరిగా అడవుల్లో తిరిగేవాడని గ్రామస్థులు చెబుతున్నారు.


చిన్నతనం నుండే శ్రీనివాస్ రెడ్డికి దొంగతనాలు చేసే అలవాటు ఉందని గ్రామస్తులు చెప్పారు.. అయితే దొంగతనాలు చేసిన సమయంలో  కుటుంబసభ్యులు శ్రీనివాస్ రెడ్డిని వారిస్తే పరిస్థితి మరోలా ఉండేదనే అభిప్రాయాలను గ్రామస్థులు వ్యక్తం చేస్తున్నారు.

గ్రామంలో తక్కువగా శ్రీనివాస్ రెడ్డి ఉండేవాడని  గ్రామస్థులు అంటున్నారు. కీసరలో మెకానిక్‌గా పనిచేసే శ్రీనివాస్ రెడ్డి  రాత్రి పూట ఇంటికి వచ్చి ఉదయం పూట వెళ్లేవాడని ఆయన గురించి తెలిసిన వారు చెబుతున్నారు.

గ్రామంలో ఎప్పుడైనా ఉంటే మాత్రం ఒంటరిగా ఆయన సంచరించేవాడని  గ్రామస్థులు చెబుతున్నారు. నిర్జన ప్రదేశాల్లో, అడవుల్లో శ్రీనివాస్ రెడ్డి ఒక్కడే తిరిగే అలవాటు ఉందని గ్రామస్తులు గుర్తు చేసుకొంటున్నారు.

శ్రావణి, మనీషా మృతదేహాలు దొరికిన వ్యవసాయ బావుల వద్ద కూడ అప్పుడప్పుడూ శ్రీనివాస్ రెడ్డి సంచరించేవాడని గ్రామస్తులు అంటున్నారు.ఇటీవలనే శ్రీనివాస్ రెడ్డి కుటుంబసభ్యులు భూమిని విక్రయించారు. దీనికి సంబంధించిన డబ్బు కూడ రావడంతో జల్సాలు చేసేవాడని గ్రామస్తులు చెబుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios