పాలమూరు పాలిటిక్స్ 

రంజాన్ పండుగ సందర్భంగా ఇఫ్తార్ విందులు జోరుగా సాగుతున్నాయి. తెలంగాణ అంతటా విందుల హడావిడి ఉంది. నాగర్ కర్నూల్ పట్టణంలో సాయి గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ముస్లిం సోదరులకు నాగం జనార్దన్ రెడ్డి ఆదివారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ముస్లిం మౌజాన్ ఈమామ్ లకు శాలువాతో సత్కరించారు. ముస్లిం సోదరులకు రంజాన్ పండగా శుభాకాంక్షలు తెలిపారు.గతంలో మజీద్ లకు, ఈద్గా లకు,దర్గా లకై ఎంతో సహాయం చేసానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాగం చిరకాల ప్రత్యర్థి, వనపర్తి ఎమ్ఎల్ ఎ చిన్నారెడ్డి హాజరు కావడం చర్చనీయాంశమైంది. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపి మల్లు రవి కూడా పాల్గొన్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred