Asianet News TeluguAsianet News Telugu

మునుగోడు బైపోల్ 2022:ఆరో రౌండ్‌లో కోమటిరెడ్డిపై కూసుకుంట్ల ఆధిక్యం

మునుగోడు ఉప  ఎన్నిక ఆరో రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యాన్ని కొనసాగించింది.  నాలుగు రౌండ్ల  నుండి టీఆర్ఎస్  లీడ్ లో కొనసాగుతూ వచ్చింది.

Munugode bypoll 2022:TRS Candidate Kusukuntla Prabhakar Reddy  Leads in Sixth Round
Author
First Published Nov 6, 2022, 12:41 PM IST


మునుగోడు:మునుగోడు  అసెంబ్లీ ఉపఎన్నిక కౌంటింగ్ లో ఆరో  రౌండ్ లో  బీజేపీ  అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై  తన సమీప టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి  ఆదిక్యంలో నిలిచారు. ఆరో  రౌండ్ లో  టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 6,016 ఓట్లు, బీజేపీఅభ్యర్ధి  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 5,378  ఓట్లు వచ్చాయి.ఆరో రౌండ్లో టీఆర్ఎస్  638  ఓట్ల  ఆధిక్యాన్ని దక్కించుకుంది.

మునుగోడు అసెంబ్లీ  ఉప  ఎన్నిక కౌంటింగ్ ను ఇవాళ నిర్వహిస్తున్నారు.చౌటుప్పల్  పట్టణంతో పాటు రూరల్ మండలంపై  బీజేపీ ఆశలు  పెట్టుకుంది. అయితే  ఫస్ట్  రౌండ్ లో బీజేపీ  కంటే  టీఆర్ఎస్  ఆధిక్యంలో నిలిచింది. కానీ సెకండ్ రౌండ్ లో బీజేపీ టీఆర్ఎస్ పై పైచేయి సాధించింది.మూడో రౌండ్ లో కూడ బీజేపీ లీడ్ దక్కించుకుంది. నాలుగో రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యాన్ని సాధించింది..ఐదో రౌండ్ లో కూడ టీఆర్ఎస్  ఆధిక్యాన్ని  సాధించింది. ఆరో రౌండ్ లో  టీఆర్ఎస్ లీడ్ లో నిలిచింది.  ఆరు  రౌండ్లను కలుపుకుంటే  టీఆర్ఎస్  అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్  రెడ్డికి  38,521 ఓట్లు, బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి  రాజగోపాల్  రెడ్డికి 36,352  ఓట్లు , కాంగ్రెస్  అభ్యర్ధి  పాల్వాయి  స్రవంతికి 11,894  ఓట్లు  దక్కాయి.

also read:మునుగోడు బైపోల్ 2022: ఐదో రౌండ్‌లోనూ టీఆర్ఎస్ లీడ్

ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి రాజీనామా  చేశారు. దీంతో ఈ స్థానానికి ఇవాళ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే  పదవికి రాజీనామా  చేయడానికి నాలుగు రోజుల ముందే కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి కాంగ్రెస్  పార్టీకి  రాజీనామా  చేశారు.  అదే నెల 21న బీజేపీలో చేరారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఈ స్థానం నుండి  కోమటిరెడ్డి రాజగోపాల్   రెడ్డి విజయం  సాధించారు. ఈ దఫా  బీజేపీ అభ్యర్ధిగా బరిలో కి దిగారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి, టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీలో  ఉన్నారు. మునుగోడు  ఉప ఎన్నికల్లో  47 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు.  47  మందిలో  ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ  నెలకొంది.

Follow Us:
Download App:
  • android
  • ios