హైద్రాబాద్ కూకట్ పల్లిలో దారుణం చోటు చేసుకొంది. ఓ తల్లి చిన్నారిని బస్సు కిందకు విసిరేసింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడింది.

హైదరాబాద్: హైద్రాబాద్ కూకట్‌పల్లి భాగ్యనగర్ కాలనీలో దారుణం చోటు చేసుకొంది. స్వంత కూతురునే ఓ తల్లి బస్సు కిందకు తోసేందుకు ప్రయత్నించింది. అయితే బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో బాధితురాలు ప్రాణాలతో బయటపడింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

బస్సు డ్రైవర్ అప్రమత్తం కావడంతో కూతురు బతికిందని భావించిన ఆ తల్లి ఆ పాపను రోడ్డుపై విసిరేసింది. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన స్థానికులు ఆ కఠినాత్మురాలికి బుద్ది చెప్పారు.

ఆ తల్లిని పట్టుకొని చెట్టుకు కట్టేసి చితకబాదారు. చిన్నారిని ఆ తల్లి ఎందుకు బస్సు కిందకు విసిరేసిందనే విషయమై కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనకు పాల్పడిన మహిళ ఏ ప్రాంతానికి చెందిందో కూడ తెలియరాలేదు.