Asianet News TeluguAsianet News Telugu

దారుణం.. కొడుకిని ఇటుకతో కొట్టిచంపిన తల్లి

భర్త మీద కోపంతో.. ఓ వివాహిత.. కన్న బిడ్డలను చంపి.. తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. 

mother kills her son by hitting with bricks
Author
Hyderabad, First Published Mar 4, 2019, 12:55 PM IST


భర్త మీద కోపంతో.. ఓ వివాహిత.. కన్న బిడ్డలను చంపి.. తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఈ క్రమంలో ఒక కొడుకు ప్రాణాలు కోల్పోగా.. మరో కొడుకు కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ విషాదకర సంఘటన గోదావరిఖనిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... గోదావరిఖనిలోని సప్తగిరి కాలనీలో నివాసం ఉంటున్న రమాదేవి దంపతులకు ఇద్దరు పిల్లలు అజయ్‌, ఆర్యన్‌. భర్త ఎన్టీపీసీలో పని చేస్తాడు. ఈ నేపథ్యంలో ఆదివారం భార్యభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం రమాదేవి భర్త విధులకు వెళ్లాడు. భర్త మీద కోపంతో రమాదేవి.. పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకోవాలని భావించింది.

దాంతో ఇటుకతో పిల్లలిద్దరిని విచక్షణారహితంగా కొట్టింది. ఈ సంఘటనలో పెద్ద కుమారుడు అజయ్‌(11) అక్కడిక్కడే మృతి చెందగా.. ఆర్యన్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత గ్యాస్‌ లీక్‌ చేసి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది రమాదేవి. ఈ లోపే స్థానికులు అక్కడికి చేరుకుని ఆమె ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios