Asianet News TeluguAsianet News Telugu

దారుణం : అదృశ్యమై.. అస్తిపంజరంగా మారి...

కనిపించకుండా పోయిన ఓ వ్యక్తి ఆరునెలల తరువాత అస్థిపంజరంగా కనిపించాడు. ఈ దారుణ ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి గ్రామంలో కలకలం రేపింది. 

missing man found skeleton in medak- bsb
Author
Hyderabad, First Published Mar 16, 2021, 9:19 AM IST

కనిపించకుండా పోయిన ఓ వ్యక్తి ఆరునెలల తరువాత అస్థిపంజరంగా కనిపించాడు. ఈ దారుణ ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి గ్రామంలో కలకలం రేపింది. 

అదృశ్యమైన ఓ వ్యక్తిని ఆరు నెలల తరువాత అస్థిపంజరంగా కౌడిపల్లి మండలం తునికి గ్రామ శివారు కలీల్ సాగర్ చెరువు దగ్గర పశువుల కాపర్లు గమనించారు. ఎస్ఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. తునికికి చెందిన యతిరాజుల గణేష్ (32)కు మతిస్థితిమితం సరిగా లేదు. ఆరు నెలల క్రితం ఇంటినుంచి వెళ్లిపోయాడు. అప్పట్లో కుటుంబసభ్యులు అతను కనిపించడం లేదని ఠాణాలో ఫిర్యాదు చేశారు. 

కలీల్ సాగర్ చెరువు వద్ద మనిషికి సంబంధించిన అస్థిపంజరం కాపర్లకు కనిపించడంతో వారు కుటుంబీకులకు చెప్పారు. అక్కడ ఉన్న దుస్తులు, చెప్పుల ఆనవాళ్లను బట్టి గణేశ్ ది అని గుర్తించారు. భార్య లావణ్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios