Asianet News TeluguAsianet News Telugu

మంచిర్యాలలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం

మంచిర్యాల: తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ మైన‌ర్ బాలిక‌పై ఇద్ద‌రు యువ‌కులు సామూహిక అత్యాచారం చేశారు. కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ జరుపుతున్నారు. 
 

Minor girl gang-raped in Mancherial
Author
First Published Sep 3, 2022, 12:30 AM IST

జన్కాపూర్: ఓ మైన‌ర్ బాలిక తాగునీరు తీసుకురావ‌డానికి వెళ్తుండ‌గా, ఇద్ద‌రు యువ‌కులు బాలిక‌ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి సామూహిక లైంగిక‌దాడికి పాల్ప‌డ్డారు. బాధితురాలు త‌ల్లిదండ్రుల‌కు చెప్ప‌డంతో వెలుగులోకి వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న మంచిర్యాల‌లో చోటుచేసుకుంద‌ని తెలంగాణ టూడే నివేదించింది. 

పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. కన్నెపల్లి మండలం జన్కాపూర్ గ్రామంలో బోరుబావి నుంచి తాగునీరు కోసం వెళ్తుండ‌గా మైనర్ బాలికపై ఇద్దరు బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. బుధ‌వారం చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. నిందితులు మేజర్‌లా లేక మైనర్లా అనే విషయం ఇంకా నిర్ధారణ కాలేదు. బాధితురాలు జన్కాపూర్‌కు చెందిన 14 ఏళ్ల బాలిక, తొమ్మిదో తరగతి విద్యార్థిని అని కన్నెపల్లి పోలీసులు తెలిపారు. నిందితులు కూడా ఇదే గ్రామానికి చెందినవార‌ని పేర్కొన్నారు. బాలిక‌పై అత్యాచారం చేసిన త‌ర్వాత నిందితులు పరారీలో ఉన్నార‌ని పోలీసులు తెలిపారు. 

బోరుబావి నుంచి తాగునీరు తెచ్చేందుకు వెళ్తుండగా బాలికపై ఇద్దరు సామూహిక‌ లైంగికదాడికి పాల్పడ్డారు. శుక్రవారం నాడు జరిగిన దారుణాన్ని బాధితురాలు తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల‌ను త్వ‌ర‌లోనే అదుపులోకి తీసుకుంటామ‌ని పేర్కొన్నారు. 

ఇదిలావుండగా, హర్యానాలోని ఫతేహ్‌బాద్‌లో ట్రైన్‌లో కొడుకుతో ప్రయాణిస్తున్న ఓ మహిళపై లైంగిక దాడి చేయడానికి ఓ దుండగుడు ప్రయత్నించాడు. కానీ, ఆమె ప్రతిఘటించింది. దీంతో ఆ దుండగుడు మహిళను ట్రైన్ నుంచి బయటకు  తోసేశాడు. ఆ తర్వాత నిందితుడు కూడా బయటకు దూకేశాడు. చివరకు తండ్రి వచ్చి చూడగా ఆ కోచ్‌లో కొడుకు ఒంటరిగా కనిపించాడు. 30 ఏళ్ల ఆ మహిళ విగత జీవై కనిపించింది. నిందితుడు గాయాలతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు, బాధితురాలి భర్త వివరాల ప్రకారం, కొన్ని రోజులగా ఆ మహిళ రోహతక్‌లో నివసిస్తున్నది. గురువారం రాత్రి ఆమె తొహనాలోని భర్త దగ్గరకు కొడుకుతో కలిసి రావడానికి బయల్దేరింది. రోహతక్ నుంచి తొహనా 145 కిలోమీటర్లు. ఆమె దాదాపు తొహనాకు సమీపంగా వచ్చేసింది. అయితే, అదే బోగీలో ప్రయాణిస్తున్న 27 ఏళ్ల సందీప్.. ఆ మహిళపై కన్నేశాడు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడటానికి యత్నించగా.. ప్రతిఘటించడంతో ట్రైన్ నుంచి బయటకు తోసేశాడు. అనంతరం సందీప్  కూడా ట్రైన్ నుంచి బయటకు దూకేశాడు. 

మరోఘటనలో గురుగ్రామ్ లోని DLF ఫేజ్ 3 ఏరియాలోని ఒక ప్లాట్‌లో గురువారం ఉదయం 50 ఏళ్ల మహిళ శవమై కనిపించింది. హత్యకు ముందు అత్యాచారం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళ ఒడిశాకు చెందినదని, నాథుపూర్ గ్రామంలోని కూరగాయల మార్కెట్ సమీపంలో ఉదయం 9 గంటల సమయంలో మృతదేహం అర్ధనగ్న స్థితిలో కనిపించిందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించిన త‌ర్వాత రిపోర్టులు వ‌చ్చాక త‌దుప‌రి విచార‌ణ కొన‌సాగుతుంద‌ని తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళను గొంతుకోసి హత్య చేసినట్లు స‌మాచారం. కొన్ని నెలల క్రితం ఆమె తన సోదరి ఇంటికి వచ్చిందని, తన సోదరి చనిపోవడంతో మానసికంగా కుంగిపోయిందని మహిళ బంధువు తెలిపారు. ఐపీసీ సెక్షన్ 302 (హత్య) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది.

Follow Us:
Download App:
  • android
  • ios